English | Telugu

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, ఇండియన్‌ క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ ధోని ముంబైలో కలుసుకున్నారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 13 సంవత్సరాల క్రితం ఒక కమర్షియల్‌ యాడ్‌ కోసం వీరిద్దరూ కలిసారు. మళ్ళీ ఇన్నాళ్ళకు కలుసుకున్నారు. ఈ ఫోటో బయటికి వచ్చిన మరుక్షణమే సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘బెస్ట్‌ పిక్‌ ఆప్‌ ది డే’ అంటూ కామెంట్లు పెడుతూ షేర్‌ చేస్తున్నారు నెటిజన్లు.

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ అనుకుంటున్నారు. 2009లో పెప్సీ యాడ్‌లో ఇద్దరూ కలిసి కనిపించారు. అప్పట్లో దానికి మంచి పేరు వచ్చింది. అయితే ఒక కమర్షియల్‌ యాడ్‌లో కలిసి నటించేందుకే మళ్ళీ కలిసారని తెలుస్తోంది. పెప్సీ యాడ్‌ బాగా సక్సెస్‌ అవ్వడంతో మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి యాడ్‌ చేస్తే బాగుంటుందని అప్పట్లో అభిమానులు కోరుకున్నారు. అది ఇన్నాళ్ళకు జరుగుతోంది. వాస్తవానికి 2016లో నీరజ్‌ పాండే దర్శకత్వంలో రూపొందిన ‘ఎం.ఎస్‌.ధోని’ బయోపిక్‌లో సురేష్‌ రైనా పాత్రను రామ్‌చరణ్‌ చేస్తారనే వార్త వినిపించింది. అది రూమర్‌ అని తర్వాత అర్థమైంది. అయితే మళ్ళీ ఇద్దరూ కలిసి ఒక యాడ్‌ నటించడం అనేది ఇద్దరి అభిమానులు సంతోషించే విషయమే కదా.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.