English | Telugu

చెర్రీ శ్రీను దానయ్య... ఓ సినిమా

రాంచరణ్ హీరోగా మరో చిత్రం తెరకెక్కనుంది. దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించే ఈ చిత్రం ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ విషయంపై నిర్మాత మాట్లాడుతూ... "మా సంస్థలో "దేశముదురు", "జులాయి", "నాయక్", "కెమెరామెన్ గంగతో రాంబాబు"... వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. ఇపుడు మరోసారి చరణ్ తో సినిమా చేయడం ఆనందంగా ఉంది. మిగిలిన వివరాలు త్వరలోనే చెబుతాము" అన్నారు.

ప్రస్తుతం చరణ్ "గోవిందుడు అందరివాడేలే" చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అదే విధంగా శ్రీనువైట్ల తెరకెక్కిస్తున్న "ఆగడు" చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .