English | Telugu

ఏ పనీ లేనివాళ్ళే అలా చేస్తారు.. ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ రకుల్‌!

సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ అనేది సర్వసాధారణం. అతిగా ప్రవర్తించినవారిపై, తమకు నచ్చినవారిపై తరచూ ట్రోలింగ్‌ జరుగుతుంటుంది. ఈ వ్యవహారంపై హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు. దేశంలోని పనీపాటా లేని వారు ఎక్కువైపోయారని, వారికి ఇది తప్ప మరో పని లేదని తన పోస్ట్‌లో ట్రోలర్స్‌ని ఉద్దేశించి కామెంట్‌ చేశారు. ఇతరుల వ్యక్తిగత జీవితాలపై అనవసరమైన కామెంట్స్‌ చేస్తూ టైమ్‌ పాస్‌ చేస్తుంటారని ఘాటుగా స్పందించారు. సోషల్‌ మీడియా అనేది చాలా ఉపయోగకరమైందని, దాన్ని ఇలా దుర్వినియోగం చేయడం ఎంతో బాధాకరమన్నారు.

తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన రకుల్‌.. ఆమధ్య జాకీ భగ్నానీని ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం తమిళ్‌లో ఒక సినిమా, హిందీలో ఒక సినిమా చేస్తున్న రకుల్‌కి తెలుగులో ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదు. అయినా సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్‌ మీడియాలో ఏదైనా డిస్కషన్‌ వచ్చినా, ట్రోలింగ్‌ జరుగుతున్నా వాటిపై తన ఒపీనియన్‌ చెప్తుంటుంది. తాజాగా సెలబ్రిటీలను ట్రోల్‌ చేస్తున్న విషయం గురించి ఘాటుగా స్పందించి మరోసారి వార్తల్లోకి వచ్చింది రకుల్‌. ఆమధ్య అవ్‌నీత్‌ కౌర్‌ పోస్టుకి విరాట్‌ కోహ్లి లైక్‌ కొట్టడంపై జరిగిన రచ్చకి సంబంధించి రకుల్‌ స్పందించింది. విరాట్‌ లైక్‌ కొట్టిన తర్వాత అవ్‌నీత్‌ ఇన్‌స్టా ఎకౌంట్‌లో 2 మిలియన్ల ఫాలోవర్స్‌ పెరిగారు. దీన్ని బట్టి మనదేశంలో సోషల్‌ మీడియాను ఫాలో అవుతూ ఎంత మంది టైమ్‌ వేస్ట్‌ చేసుకుంటున్నారో అర్థమవుతుంది అంటూ నెటిజన్లను టార్గెట్‌ చేస్తూ కామెంట్‌ చేసింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.