English | Telugu

నా సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే అర్ధనగ్నంగా తిరుగుతా.. ఏరియా ఇదే  


దర్శకుడు సంచలన వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
రాజు వెడ్స్ రాంబాయి ఎలా ఉండబోతుంది!
ఖమ్మం, వరంగల్ బోర్డర్ లో జరిగిన కథ

ఒక సినిమా అన్ని హంగుల్ని హద్దుకొని సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టడానికి ప్రధాన మూలస్థంభంగా నిలిచే వ్యక్తి దర్శకుడు. అటువంటి దర్శకులకి తమ సినిమా ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ఉంటుంది. కానీ అంతిమ తీర్పు మాత్రం ప్రేక్షకులదే. కానీ ఈ మధ్య కాలంలో సదరు ప్రేక్షకులకి దర్శకులు సవాలు విసురుతున్నారు.


ఈ నెల 21 న 'రాజు వెడ్స్ రాంబాయి'(Raju weds rambai)అనే మూవీ రిలీజ్ కాబోతుంది. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కగా అఖిల్ రాజ్(AKhil Raj)తేజస్వి రావు(Tejaswi Rao)జంటగా నటించారు. సాయిలు కంపాటి(Saailu Kaampati)రచన దర్శకత్వం వహించాడు. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతు నా సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే అమీర్ పేటలో అర్ధనగ్నంగా తిరుగుతాను అనే వైరల్ కామెంట్ చేసాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రియులు స్పందిస్తు సినిమా బాగుంటే ఖచ్చితంగా మంచి టాక్ తో రన్ అవుతుంది. బాగున్నసినిమాని కావాలని ఎవరైనా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా ఎవరు నమ్మరు. సినిమాకి అంత శక్తీ ఉంది. అలాంటిది ఈ రకంగా బోల్డ్ స్టేట్ మెంట్ ఇవ్వడం ఎందుకనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


also read:ఎవరు ఎటు వైపు.. ఏం జరగబోతుంది!

మరి కొంత మంది స్పందిస్తు ఒక వేళ సినిమా బాగోక నెగిటివ్ టాక్ వస్తే నిజంగానే అమీర్ పేట లో తిరుగుతాడా ఏంటనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా దర్శకుడు చేసిన వ్యాఖ్యలు సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. సురేష్ బొబ్బిలి సంగీత సారధ్యంలో రాహుల్ మోపిదేవి నిర్మించగా, ఖమ్మం, వరంగల్ బోర్డర్ కి సంబంధించి ఒక ఏరియాలో జరిగిన నిజజీవిత క్యారెక్టర్స్ ఆధారంగా 'రాజు వెడ్స్ రాంబాయి' తెరకెక్కింది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.