English | Telugu

గుడిలో రజినీకాంత్... ష‌ర్ట్‌కి జేబు లేదు!

సూపర్‌స్టార్ రజినీకాంత్ ఇప్పుడు జైల‌ర్ మూవీ ఇచ్చిన స‌క్సెస్ మూవీ ఊపులో ఉన్నారు. ఇదే సంద‌ర్భంలో ఆయ‌న ప‌లు ఆల‌యాల‌ను సంద‌ర్శిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది. దీనిపై నెటిజ‌న్స్ త‌మదైన శైలిలో కామెంట్స్‌, ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంత‌కీ ఆ వీడియోలో ఏముందో తెలుసా..గుడికి వెళ్లిన ర‌జినీకాంత్ దైవ ద‌ర్శ‌నం త‌ర్వాత త‌న చొక్కా మ‌డ‌త‌లో నుంచి డ‌బ్బులు తీసి ద‌క్షిణ వేశారు. ఇలా ఒక తలైవ‌ర్ మాత్ర‌మే చేయ‌గ‌ల‌రు అంటూ కొంద‌రు వీడియోను షేర్ చేస్తున్నారు.

అయితే కొంద‌రు నెటిజ‌న్స్ మాత్రం ర‌జినీకాంత్ ఇలా చేస్తారు? అని అంటున్నారు. దానికి ర‌జినీ వేసుకున్న ష‌ర్ట్‌కి జేబు లేదు. అందుక‌నే ఆయ‌న చొక్కా చేతి మ‌డ‌త‌లో డ‌బ్బులు తీసుకుని వచ్చి ద‌క్షిణ వేశార‌ని ఆయ‌న‌కు మ‌ద్దతుగా మాట్లాడుతున్నారు. 80ల‌లో అంత‌కు ముందున్న‌వారు చాలా మంది ఇలా మ‌డ‌త‌ల్లో డ‌బ్బులు పెట్టుకునేవార‌ని దీనిపై కామెంట్స్ చేయ‌టం స‌రికాద‌ని కూడా అనేవారు లేక‌పోలేదు. ఏదైతేనేం త‌లైవ‌ర్ ఏది చేసినా ఇప్పుడు వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తున్నారు మ‌రి.

ఇప్పుడు త‌లైవ‌ర్ త‌న 170వ సినిమా కోసం సిద్ధ‌మ‌వుతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొంద‌నున్న ఈ సినిమాను జై భీమ్ ఫేమ్ టి.జి.జ్ఞాన‌వేల్ తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో ర‌జినీకాంత్‌తో పాటు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్, మ‌ల‌యాళ స్టార్ ఫ‌హాద్ ఫాజిల్, టాలీవుడ్ స్టార్ రానా ద‌గ్గుబాటి తోపాటు మంజు వారియ‌ర్ కూడా ఆక‌ట్టుకోబోతున్నారు. ఈ చిత్రంలో ఆయ‌న ఫేక్ ఎన్‌కౌంటర్స్ మీద పోరాటం చేసే రిటైర్డ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు. దీని త‌ర్వాత లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఓ సినిమా తెర‌కెక్క‌నుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.