English | Telugu

కర్నూల్లో "రచ్చ" 50 రోజుల వేడుక

కర్నూల్లో "రచ్చ" 50 రోజుల వేడుక జరుగనుందట. మెగా సూపర్ గుడ్ పతాకంపై, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ నిర్మించిన చిత్రం"రచ్చ". ఈ "రచ్చ" చిత్రం ఆడియో విడుదలను కర్నూల్లో జరుపుతారని వినపడింది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ వేడుకను హైదరాబాద్ లోనే నిర్వహించటం జరిగింది.

ఈ రోజుతో అంటే 24-5-2012 కి "రచ్చ" చిత్రం విడుదలై 50 రోజులయ్యింది. 127 సెంటర్లలో "రచ్చ"చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ఆడియో విడుదల సభలో దర్శకుడు సంపత్ నంది చెప్పిన మాట ప్రకారం ఈ అర్థశతదినోత్సవ వేడుకను కర్నూల్ లో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.