English | Telugu

రాజకీయాల్లోకి దిల్ రాజు?

సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్లడం సహజం. ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే దిల్ రాజు మాత్రం రాజకీయాలు తన వల్ల కాదని అంటున్నారు.

దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందిన 'బలగం' సినిమా మార్చి 3న థియేటర్లలో విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓటీటీలోనూ విశేష ఆదరణ పొందుతున్న ఈ చిత్రాన్ని.. కొన్ని గ్రామాల్లో ప్రత్యేక షోలు వేసుకొని మరీ అందరూ కలిసి చూస్తున్నారు. 'బలగం' సినిమా ప్రేక్షకులకు ఇంతలా చేరువ అవ్వడంతో.. తాజాగా మూవీ టీమ్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన దిల్ రాజు తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

"రాజకీయాల్లోకి రమ్మని నన్ను అడుగుతున్నారు. అయితే వెళ్లాలా వద్దా అనేది ఇంకా నాకే క్లారిటీ లేదు. సినీ పరిశ్రమలో నాపై విమర్శలు వస్తేనే తట్టుకోలేను. రాజకీయాల్లోకి వెళ్లాలంటే మెంటల్ గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అది నా వల్ల కాకపోవచ్చు. దీనిలోనే మీకు కావాల్సిన సమాధానం ఉంది" అంటూ దిల్ రాజు తనదైన శైలిలో పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.