English | Telugu

తమిళనాట పుష్పరాజ్ వినాయకచవితి.. హిందూ సంఘాల ఆగ్రహం 

'స్టైలిష్ స్టార్' గా ఉన్న అల్లు అర్జున్(Allu Arjun)'పుష్ప పార్ట్ 1'తో పాన్ ఇండియా వ్యాప్తంగా సత్తా చాటి 'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్ గా ఎస్టాబ్లిష్ అయిన విషయం తెలిసిందే. పార్ట్ 1 తో వచ్చిన ట్రెండ్ ని కంటిన్యూ చేస్తు 'తగ్గేదెలే' అంటు 'పుష్ప పార్ట్ 2'(Pushpa 2)తో ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఈ రెండు భాగాల ద్వారా పాన్ ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులని సంపాదించడమే కాకుండా, పుష్ప క్యారక్టర్ ని అభిమానులు ఓన్ చేసుకునేలా అల్లు అర్జున్ నటన కొనసాగింది. అందుకు నిదర్శనంగా నిలిచిన ఒక సంఘటన తమిళనాడు(Thamilandu)లో జరిగింది.

నిన్నప్రారంభమైన 'వినాయక చవితి' వేడుకలు దేశ వ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు 'గజముఖుడ్ని' పలు రూపాల్లో రూపొందించుకొని, భక్తితో ప్రార్దిస్తు తన్మయత్వం చెందటం పరిపాటి. తమ శక్తి కొలది భారీ స్థాయిలో మండపాలు కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఈ కోవలోనే తమిళనాడులోని 'హొసూరు' కి చెందిన అల్లు అర్జున్ అభిమానులు వినాయక చవితి వేడుకల సందర్భంగా 'పుష్ప 2 'లో క్లైమాక్స్ ఫైట్ జరిగిన బిల్డింగ్ సెట్ లా ఉండేలా, ఎర్ర చందనం దుంగలు పోలిన వాటితో భారీ మండపాన్ని ఏర్పాటు చేసారు.మండపం బయట అల్లు అర్జున్ వాడిన హెలికాఫ్టర్, భుజంపై గన్ తో ఉన్న పుష్పరాజ్ ఉండగా, లోపల అమ్మవారి గెటప్ లో త్రిశూలం ధరించిన పుష్పరాజ్ కి వినాయకుడిగా ఏర్పాటు చేసుకొని పూజలు చేస్తున్నారు.

ముప్పై లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ సెట్టింగ్ కి సంబందించిన వీడియోని అల్లు అర్జున్ స్నేహితుడు, ప్రముఖ నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu)సోషల్ మీడియా వేదికగా షేర్ చేసాడు. ఇక దేవుడి రూపానికి పుష్ప రాజ్ లాంటి ఒక స్మగ్లర్ ఆకారంలో రూపొందించడం పట్ల పలు హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గతంలోను తెలుగు నాట 'బాహుబలి' వినాయకుడు, పుష్ప వినాయకుడిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.