English | Telugu

అసలు పూరీ తగ్గడం లేదుగా..!!

టాలీవుడ్ లో స్టార్‌ కాంబినేషన్లో సినిమా అంటే కనీసం ఏడాది పడుతుంది ఈ రోజుల్లో. కానీ పూరి జగన్నాథ్‌ మాత్రం మిగతా డైరెక్టర్లకు చాలా భిన్నం. తాను పని చేసేది చిన్న హీరోతోనా, పెద్ద హీరోతోనా అనేది పూరి పట్టించుకోడు. మూణ్నాలుగు నెలల్లో సినిమా తీసి.. ఫస్ట్‌ కాపీ రెడీ చేసేయగల ఘనుడతను. మహేష్‌ బాబు లాంటి స్టార్‌తో 74 రోజుల్లో ‘బిజినెస్‌మేన్‌’ తీసేసిన ఘనత పూరిది. ఈ మధ్య ఛార్మితో ‘జ్యోతి లక్ష్మి’ సినిమాను కేవలం 37 రోజుల్లో పూర్తి చేశాడు పూరి. ఐతే ఇప్పటిదాకా తీసిన సినిమాలు వేరు. ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవితో తీయబోయే సినిమా వేరు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత చిరు చేస్తున్న చిత్రం.. పైగా ఆయనకు 150వ సినిమా.. అలాంటపుడు చాలా జాగ్రత్తగా షూట్‌ చేయాలి. ప్రతి సన్నివేశం తరచి తరచి చూసుకోవాలి. ఔట్‌పుట్‌ పక్కాగా ఉండాలి. కానీ పూరి మాత్రం చిరు సినిమాను కూడా 75 రోజుల్లోనే పూర్తి చేయడానికి ప్లాన్‌ గీసేశాడట. ఐతే ఓ ప్రెస్టీజియస్‌ మూవీని ఇలా హడావుడిగా పూర్తి చేయడం కరెక్టా.. అందుకు చిరు కానీ, నిర్మాత రామ్‌చరణ్‌ కానీ ఒప్పుకుంటారా అనేది సందేహం. కానీ స్క్రిప్టు పక్కాగా ఉంది కాబట్టి తన ప్లాన్‌లో ఏ మార్పు చేసుకోవాల్సిన అవసరం లేదని పూరి భావిస్తున్నాడట. చిరు సినిమా పూర్తి చేసి.. ఈ ఏడాదే మహేష్‌ సినిమాను కూడా మొదలుపెట్టాలన్న ప్రణాళికలో ఉన్నాడట పూరి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.