English | Telugu

మీ అందరినీ నిరాశపరిచినందుకు సారీ.. నాగవంశీ సంచలన వ్యాఖ్యలు!

జూనియర్ ఎన్టీఆర్ నటించిన మొదటి బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'ని తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత నాగవంశీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా తెలుగునాట ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోతోంది. అలాగే నాగవంశీ నిర్మించిన గత చిత్రం 'కింగ్డమ్' కూడా కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలింది. ఈ వరుస షాక్ లతో నాగవంశీ డిప్రెషన్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఫోన్ స్విచాఫ్ చేశారని, దుబాయ్ వెళ్లిపోయారని, సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉండనున్నారని.. ఇలా రకరకాల న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే ఒక ట్వీట్ తో ట్రోలర్స్ కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు నాగవంశీ.

"ఏంటి నన్ను చాలా మిస్ అవుతున్నట్టు ఉన్నారు. వంశీ అది, వంశీ ఇది అని ఆసక్తికర కథనాలతో ఫుల్ హడావిడి నడుస్తుంది. పర్లేదు, ఎక్స్(ట్విట్టర్)లో మంచి రైటర్స్ ఉన్నారు. మీ అందరినీ నిరాశపరిచినందుకు క్షమించండి. ఇంకా ఆ టైం రాలేదు. కనీసం ఇంకో 10-15 ఏళ్ళు ఉంది. ఎల్లప్పుడూ సినిమాతోనే ఉంటాను. త్వరలోనే 'మాస్ జాతర' సినిమాతో మీ అందరినీ కలుస్తాను." అని నాగవంశీ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. "నాగవంశీ సినిమాలు వదిలేశారు, దుబాయ్ వెళ్లిపోయారు" అంటూ జరుగుతున్న ప్రచారాలకు ఒకే ఒక్క ట్వీట్ తో చెక్ పెట్టారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.