English | Telugu

సీక్వెల్ ప్రకటన వచ్చింది.. పోస్టర్ తోనే అంచనాలు పెంచేశారు

జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నారా రోహిత్. ఇప్పటిదాకా అతను 18 సినిమాలు చేయగా, కథల ఎంపికలో తొలి సినిమా 'బాణం' నుంచే వైవిధ్యం చూపిస్తున్నాడు. ముఖ్యంగా అతని కెరీర్ లో కొన్ని సినిమాలు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. అందులో 'ప్రతినిధి' ఒకటి. రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందింది. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ ప్రకటించాడు రోహిత్.

'ప్రతినిధి-2'ని అధికారికంగా ప్రకటిస్తూ ఈరోజు(జూలై 24న) పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ లో న్యూస్ పేపర్లతో రోహిత్ రూపాన్ని రూపొందించిన తీరు ఆకట్టుకుంది. 'ప్రతినిధి'కి ప్రశాంత్ మండవ దర్శకత్వం వహించగా, 'ప్రతినిధి-2'కి ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. వానర ఎంటెర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని 2024, జనవరి 25 న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.