English | Telugu
'బ్రో' సెన్సార్ రిపోర్ట్.. ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!
Updated : Jul 24, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం 'బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడం విశేషం. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ లో వింటేజ్ పవర్ స్టార్ ని చూసి ఫ్యాన్స్ పొంగిపోయారు. అయితే ఇప్పుడు సెన్సార్ రిపోర్ట్ రూపంలో వారికి ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది.
'బ్రో' సినిమా కుటుంబమంతా చూడదగ్గ ఫీల్ గుడ్ ఫిల్మ్ అని మూవీ టీం ముందు నుంచి చెబుతోంది. అందుకుతగ్గట్టుగానే బ్రో చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ లభించింది. ఇక ఈ సినిమా నిడివి కూడా 134 నిమిషాలే. అంటే 2 గంటల 15 నిమిషాల లోపే. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ ఏమాత్రం పండినా.. ఈ తక్కువ నిడివి, సినిమాకి మరింత లాభం చేకూర్చే అవకాశముంది. పైగా సెన్సార్ సభ్యుల నుంచి కూడా సినిమాకి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినట్లు సమాచారం. 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత పవన్ నుంచి వస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.