English | Telugu

2025 రౌండప్.. సర్ ప్రైజ్ చేసిన కొత్త దర్శకులు.. మీ ఫేవరెట్ ఎవరు?

2025కి శుభం కార్డు పడినట్టే. ఈ ఏడాది పెద్ద సినిమాలు పెద్దగా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయలేకపోయాయి కానీ.. చిన్న సినిమాలతో కొందరు కొత్త దర్శకులు సర్ ప్రైజ్ చేశారు. పలు చిన్న సినిమాలు ప్రేక్షకుల మెప్పుపొందడమే కాకుండా, ప్రొడ్యూసర్స్ కి లాభాలు తెచ్చి పెట్టాయి. ఈ ఏడాది తమ తొలి సినిమాతోనే విజయాన్ని అందుకొని, అందరి దృష్టిని ఆకర్షించిన కొత్త దర్శకులు ఎవరంటే..?

న్యాచురల్ స్టార్ నానికి చెందిన 'వాల్ పోస్టర్ సినిమా బ్యానర్'లో రూపొందిన 'కోర్ట్'(Court) సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు రామ్ జగదీష్. పోక్సో యాక్ట్ నేపథ్యంలో రూ.5 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. రూ.55 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో రామ్ జగదీష్ ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా, నాని బ్యానర్ లోనే మరో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు.

ఈ ఏడాది చిన్న సినిమాల్లో పెద్ద సర్ ప్రైజ్ అంటే 'లిటిల్ హార్ట్స్'(Little Hearts) అని చెప్పవచ్చు. ఈటీవీ విన్‌ తో కలిసి ఆదిత్య హాసన్‌ నిర్మించిన ఈ సినిమాతో.. సాయి మార్తాండ్‌ డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. రొమాంటిక్ కామెడీ జానర్ లో కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ ఫిల్మ్.. దాదాపు రూ.40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సాయి మార్తాండ్‌ తో సినిమా చేయడానికి పలువురు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.

కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ 'కె ర్యాంప్'(K-Ramp)కి నూతన దర్శకుడు జైన్స్ నాని దర్శకత్వం వహించాడు. థియేటర్లలో నవ్వులు పూయించిన ఈ సినిమా.. యూత్ తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా మెప్పించి మంచి విజయాన్ని అందుకుంది.

సున్నిత హాస్యంతో తెరకెక్కి చక్కిలిగింతలు పెట్టిన చిత్రం 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'(The Great Pre Wedding Show). ఈ మూవీతో రాహుల్ శ్రీనివాస్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. థియేటర్లలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా.. ఓటీటీలో అంతకు రెట్టింపు రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.

'లిటిల్ హార్ట్స్' తర్వాత ఈటీవీ విన్ నుండి వచ్చిన మరో మూవీ 'రాజు వెడ్స్ రాంబాయి'(Raju Weds Rambai). ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల నిర్మాతగా మారగా, సాయిలు కంపాటి (బోస్) దర్శకుడిగా పరిచయమయ్యాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా రా లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ.. కంటెంట్ తో అందరినీ సర్ ప్రైజ్ చేసింది.

Also Read: 2025 రౌండప్.. బాక్సాఫీస్ విన్నర్ ఎవరు?

వరుస ఫ్లాప్స్ ని ఎదుర్కొంటూ, మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న ఆది సాయికుమార్ కి బిగ్ రిలీఫ్ ఇచ్చిన ఫిల్మ్ 'శంబాల'(Shambhala). ఈ మిస్టిక్ థ్రిల్లర్ కి కొత్త దర్శకుడు యుగంధర్ ముని దర్శకత్వం వహించాడు. మొదటి సినిమాతోనే.. కంటెంట్ ఉన్న డైరెక్టర్ అనిపించుకున్నాడు.

ఈ ఏడాది విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాల్లో 'దండోరా'(Dhandoraa) ఒకటి. కుల‌వివ‌క్ష అనే సున్నితమైన అంశాన్ని తీసుకొని, భావోద్వేగాలతో కట్టిపడేశాడు నూతన దర్శకుడు మురళికాంత్.

అలాగే, 'గాంధీ తాత చెట్టు'తో పద్మావతి మల్లాది, 'రామం రాఘవం'తో ధనరాజ్, 'కన్యాకుమారి'తో సృజన్ అట్టాడ, 'సుందరకాండ'తో వెంకటేష్ నిమ్మలపూడి, 'పతంగ్'తో ప్రణీత్‌ ప్రత్తిపాటి కూడా డైరెక్టర్స్ గా మంచి మార్కులే కొట్టేశారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.