English | Telugu

ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్.. ఏకంగా 18 దేశాల్లో షూట్!

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' సినిమాతో బిజీగా ఉన్నాడు. దీనిని పూర్తి చేసి త్వరలోనే బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2' షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఆ మూవీ షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసి, వచ్చే వేసవి నుంచి ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టనున్నాడు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. ఇది 'కేజీఎఫ్', 'సలార్' సినిమాలను తలదన్నేలా ఉంటుందట.

ఎన్టీఆర్ అంటే ప్రశాంత్ నీల్ కి ప్రత్యేక అభిమానం. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని తన డ్రీమ్ హీరోతో చేయబోతున్నట్లు ఎన్టీఆర్ సినిమా గురించి గతంలో నీల్ చెప్పాడు. అందుకు తగ్గట్టుగానే అత్యంత భారీ స్థాయిలో చిత్రాన్ని రూపొందించబోతున్నాడట. ఈ మూవీ కథ ప్రశాంత్ నీల్ గత చిత్రాలకు భిన్నంగా, ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఉంటుందట. అంతేకాదు చిత్రీకరణ కూడా మొత్తం విదేశాల్లోనే ఉంటుందట. ఏకంగా 18 దేశాల్లో షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మొత్తం విదేశాల్లోనే షూటింగ్ అంటే 'కేజీఎఫ్', 'సలార్' సినిమాలకు భిన్నంగా సరికొత్త కథతో రూపొందబోతుందని అర్థమవుతోంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ మూవీగా దీనిని మలచబోతున్నారట. 'ఆర్ఆర్ఆర్'తో ఇప్పటికే ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ లెక్కన ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర అసలుసిసలైన వసూళ్ల సునామీని సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు.

ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో 'సలార్' చేస్తున్నాడు. ఇది డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు నీల్. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.'సలార్', 'దేవర' సినిమాలు హిట్ అయితే ఈ అంచనాలు ఆకాశాన్నంటుతాయి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.