English | Telugu

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌ చెప్పిన సందీప్‌రెడ్డి వంగా!

గత ఏడాది రిలీజ్‌ అయి సంచలనం సృష్టించిన ‘కల్కి 2898ఎడి’ తర్వాత ప్రభాస్‌ చేస్తున్న సినిమాలపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో ఉన్న సినిమాల్లో మొదట మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘రాజాసాబ్‌’ డిసెంబర్‌లో రిలీజ్‌ కాబోతోంది. మరోపక్క హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ‘ఫౌజీ’ షూటింగ్‌ కూడా జరుగుతోంది. ఈ సినిమాలు ఇలా ఉంటే.. అందరి దృష్టీ సందీప్‌ వంగా కాంబినేషన్‌లో చేయబోతున్న ‘స్పిరిట్‌’పైనే ఉంది. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి బయట వినిపిస్తున్న వార్తలే తప్ప అఫీషియల్‌గా ఏదీ బయటికి రాలేదు. తాజాగా దర్శకుడు సందీప్‌ ‘స్పిరిట్‌’కి సంబంధించి ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చే అప్‌డేట్‌ ఇచ్చారు.

విజయ్‌ దేవరకొండతో ‘అర్జున్‌రెడ్డి’ వంటి సెన్సేషనల్‌ హిట్‌ చేసిన సందీప్‌.. ఇప్పుడు విజయ్‌ లేటెస్ట్‌ మూవీ ‘కింగ్‌డమ్‌’ ప్రమోషన్స్‌లో అతనికి హెల్ప్‌ చేసేందుకు ముందుకు వచ్చారు. అందరూ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న స్పిరిట్‌ మూవీ అప్‌డేట్‌ కూడా ఇచ్చారు. సెప్టెంబర్‌ చివరి వారంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందని క్లారిటీ ఇచ్చారు. అంటే వచ్చే ఏడాది స్పిరిట్‌ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. అర్జున్‌రెడ్డి, యానిమల్‌ చిత్రాలతో ప్రేక్షకులకు ఒక పవర్‌ఫుల్‌ కిక్‌ ఇచ్చిన సందీప్‌.. ప్రభాస్‌తో చేసే స్పిరిట్‌తో ఎలాంటి విధ్వంసం సృష్టించబోతున్నాడు అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. దానికి తగ్గట్టుగానే స్పిరిట్‌ కూడా ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు.

రాజాసాబ్‌, ఫౌజీ, స్పిరిట్‌ చిత్రాలే కాకుండా సలార్‌2, కల్కి2 చిత్రాలు కూడా ప్రభాస్‌ చెయ్యాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ప్రశాంత్‌ నీల్‌ చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత సలార్‌2 గురించి ఆలోచిస్తారని తెలుస్తోంది. ఇక కల్కి2 గురించి ఎలాంటి న్యూస్‌ బయటికి రాలేదు. దానికి సంబంధించి ఎలాంటి వర్క్‌ జరుగుతోంది అనే విషయంలో కూడా ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఏది ఏమైనా సినిమాలు పూర్తి చేసే విషయంలో ప్రభాస్‌ ఎంతో దూకుడుగా ఉన్నాడని మాత్రం అర్థమవుతోంది. తను కమిట్‌ అయిన సినిమాలను జెట్‌ స్పీడ్‌లో పూర్తి చేస్తున్నారు. ఈ విషయంలో డైరెక్టర్లకి తన ఫుల్‌ సపోర్ట్‌ ఇస్తున్నారని మాత్రం అర్థమవుతోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.