English | Telugu

‘సలార్‌’ సెన్సార్‌ రిపోర్ట్‌.. మొదటిరోజు కలెక్షన్లతోనే రికార్డు క్రియేట్‌ చేస్తుందట!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి చూపూ ప్రభాస్‌ లేటెస్ట్‌ మూవీ ‘సలార్‌’పైనే ఉంది. ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందడంతో ఎక్కడా లేని హైప్‌ వచ్చింది సినిమాకి. సెప్టెంబర్‌ 28న రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి డిసెంబర్‌ 22కి మారడంతో ప్రభాస్‌ అభిమానులు కొంత నిరాశ చెందినప్పటికీ ఎంతో ఓపికగా, మరెంతో ఉత్సాహంగా డిసెంబర్‌ 22 కోసం ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ‘సలార్‌’ కలెక్షన్లు కొల్లగొట్టి కొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తుందని అభిమానులు ఎంతో నమ్మకంతో ఉన్నారు.

ఇదిలా ఉండగా.. ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సినిమాలో యాక్షన్‌ పార్ట్‌ ఎక్కువగా ఉండడంతో ‘సలార్‌’కి ‘ఎ’ సర్టిఫికెట్‌ ఇచ్చారు. సాధారణంగా హింస్‌, యాక్షన్‌ పార్ట్‌ ఎక్కువగా ఉన్న సినిమాలకు ఎ సర్టిఫికెట్‌ ఇస్తుంటారు. డిసెంబర్‌ 1న విడుదలై ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ‘యానిమల్‌’ మూవీకి కూడా ఎ సర్టిఫికెటే ఇచ్చారు. ఇటీవలి కాలంలో ఎ సర్టిఫికెట్‌ వచ్చిన సినిమాలు సూపర్‌హిట్‌ అవుతున్నాయన్న సెంటిమెంట్‌ కూడా ఉండడంతో తప్పకుండా ‘సలార్‌’ విషయంలో అది వర్కవుట్‌ అవుతుందని అందరూ భావిస్తున్నారు. ‘సలార్‌’కి వున్న క్రేజ్‌ దృష్ట్యా డిసెంబర్‌ 22న అర్థరాత్రి 12 గంటలకే ఫస్ట్‌ షో వేస్తారని తెలుస్తోంది. ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్లతోనే కొత్త రికార్డులు క్రియేట్‌ చెయ్యడం ఖాయమని ట్రేడ్‌వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ సినిమా రన్‌ టైమ్‌ 2 గంటల 55 నిమిషాలుగా ఉందని సెన్సార్‌ ధృవీకరించింది. సెన్సార్‌ రిపోర్ట్‌ వచ్చిన తర్వాత సినిమాకి మరింత హైప్‌ పెరిగింది. రెండు నెలల క్రితమే డిసెంబర్‌ 22ని లాక్‌ చేసిన ‘సలార్‌’ మేకర్స్‌ మొదటి రోజే భారీ కలెక్షన్లు రాబట్టే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.