English | Telugu

పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రం సినిమా

పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రం సినిమా ప్రారంభం కావచ్చని సినీ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే ఇటీవల నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ కలసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, తమిళ దర్శకుడు విష్ణువర్థన్ రెడ్డి దర్శకత్వంలో "పంజా" అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించక పోవటంతో వారికి మరో సినిమా చేయటానికి హీరో పవన్ కళ్యాణ్ అంగీకరించారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.

ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించబోతున్నారని కూడా వినపడుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో,అల్లు అరవింద్ నిర్మించిన "జల్సా" సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఆ సినిమా తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇదే కావటంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొంటాయి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.