English | Telugu

పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రం సినిమా

పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రం సినిమా ప్రారంభం కావచ్చని సినీ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే ఇటీవల నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ కలసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, తమిళ దర్శకుడు విష్ణువర్థన్ రెడ్డి దర్శకత్వంలో "పంజా" అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించక పోవటంతో వారికి మరో సినిమా చేయటానికి హీరో పవన్ కళ్యాణ్ అంగీకరించారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.

ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించబోతున్నారని కూడా వినపడుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో,అల్లు అరవింద్ నిర్మించిన "జల్సా" సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఆ సినిమా తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇదే కావటంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొంటాయి.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.