English | Telugu

చిక్కుల్లో రతి నిర్వేదం హీరోయిన్.. యువతని తప్పుదోవ పట్టిస్తోందని పోలీస్ కేసు

ప్రముఖ హీరోయిన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ 'శ్వేతామీనన్'(Swetha Menon)సినీ నేపధ్యం ఎంతో ఘనమైనది. మలయాళ సూపర్ స్టార్ 'మమ్ముట్టి' కి జోడిగా, 1991 లో వచ్చిన 'అనశ్వరం' అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన శ్వేత, ఆ తర్వాత మలయాళ, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో కలుపుకొని ఇప్పటి వరకు సుమారు వంద సినిమాల వరకు చేసింది. వీటిల్లో హీరోయిన్ గా చేసిన చిత్రాలు చాలానే ఉన్నాయి. అవార్డుల పరంగా చూసుకుంటే 2009 ,2011 కి సంబంధించి మలయాళ రాష్ట్ర ప్రభుత్వం చేత బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుని సొంతం చేసుకుంది. ఫిలిం ఫేర్, సైమా అవార్డ్స్ తో పాటు ఇతర అవార్డ్స్ ని ఎన్నింటినో గెలుచుకున్న శ్వేత, మలయాళంలో తెరకెక్కిన అనేక సీరియల్స్, షోస్ ద్వారా కూడా ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది.

రీసెంట్ గా శ్వేతా మీనన్ పై మార్టిన్ అనే వ్యక్తి పోలీసులకి ఫిర్యాదు చేశాడు. అంతటితో ఆగకుండా పోలీసులు పట్టించుకోవడం లేదని కోర్టుని ఆశ్రయించాడు. ఈ విషయంపై మార్టిన్ మాట్లాడుతు శ్వేతా మీనన్ అడల్ట్ చిత్రాల్లో నటిస్తు యువతని తప్పుదోవ పట్టిస్తుంది. గతంలో కూడా ఆమె మీడియాతో మాట్లాడుతు, డబ్బుల కోసం ఎలాంటి సినిమాలైనా చేస్తా అని చెప్పిందని మార్టిన్ తెలిపాడు.

శ్వేతా మీనన్ శృంగార పరంగా చేసిన సినిమాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, 2011 లో వచ్చిన 'రతినిర్వేదం'(RathiNirvedam)మళయాళంతో పాటు ఇతర భాషల్లోను రిలీజై మంచి విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా రొమాన్స్ సన్నివేశాల్లో శ్వేతా మీనన్ నటన ప్రతి ఒక్కర్ని కట్టిపడేస్తుంది. నేటికీ సదరు సన్నివేశాలు యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ ని రాబడతాయి. 1994లో ఫెమినా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ టైటిల్ విజేతగా నిలిచిన శ్వేతా, తెలుగులో 'భానుచందర్' స్వీయ దర్శకత్వంలో 1995 లో వచ్చిన 'దేశద్రోహులు'లోను హీరోయిన్ గా చేసింది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.