English | Telugu

పవన్ బుల్లెట్టుకి చరణ్ సౌండ్ బంద్

మెగావార్ మొదలయ్యిందా? ప్రస్తుత పరిస్థితి చూస్తే అలాగే ఉంది. రాంచరణ్ నటిస్తున్న "ఎవడు" చిత్ర పాటలు, ట్రైలర్స్ ఇటీవలే విడుదలయ్యి, మంచి టాక్ సంపాదించుకుంది. మరి పవన్ కళ్యాణ్ "అత్తారింటికి దారేది" చిత్రం ఎలా ఉండబోతుందో, పాటలు ఎలా ఉంటాయో అని మెగా అభిమానుల్లో ఉత్కంట మొదలయ్యింది. అసలే "ఎవడు" ఆడియో ఫంక్షన్ లో పవన్ కోసం రచ్చ రచ్చ చేసిన పవన్ అభిమనులకీ, తమ హీరో సినిమా ట్రైలర్ విడుదల అవుతుందంటే ఇంకెలా ఉంటారో చెప్పండి!

పవన్ కళ్యాణ్ నటిస్తున్న "అత్తారింటికి దారేది" చిత్రం యొక్క చిన్న సాంపుల్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఇక అంతే.. ఖేల్ ఖతం అన్ని సౌండ్స్ బంద్. ఆ ట్రైలర్ లో కేవలం పవన్ నడుచుకుంటూ వచ్చే ఒకే సీన్ మాత్రమే ఉండటంతో పాటు,

"వీడు ఆ...రడుగుల బుల్లెట్టు.....

వీడు ధైర్యం పంపిన రాకెట్టు ...."

అనే రెండు లైన్లు మాత్రమే ఉంది. దీనికే మెగా అభిమానులు మొత్తం ఫుల్ ఖుషిలో ఉన్నారు. నిజానికి ఈ ట్రైలర్ చూస్తే "ఎవడు" చిత్రం యొక్క అన్ని ట్రైలర్స్ కంటే సూపర్ గా ఉంది. మరి ఇంకేముంది మెగా అభిమానుల్లో వార్ ప్రారంభమైనట్లేనా? ఏమో ఎవరికి తెలుసు...

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.