English | Telugu

‘జనవాణి’లో పవన్‌కు అస్వస్థత.. ఆందోళనలో అభిమానులు

జనసేన అధినేతకు అస్వస్థత.. ఈ వార్త అభిమానుల గుండెల్ని పిండేస్తోంది. తమ అభిమాన హీరో, అభిమాన నాయకుడు అనారోగ్యానికి గురి కావడం అనే మాట విని తట్టుకోలేకపోతున్నారు. ప్రజల కోసం పాటు పడే మనిషికి ఇలా ఆరోగ్య సమస్యలు రావడం పట్ల అభిమానులు ఎంతో బాధను వ్యక్తం చేస్తున్నారు.

విషయం ఏమిటంటే... వారాహి విజయ యాత్రలో భాగంగా పవన్‌కళ్యాణ్‌ మంగళవారం కృష్ణాజిల్లాలోని మచిలీ పట్నంలో పర్యటిస్తున్నారు. ఈ విజయయాత్రలో ప్రత్యేకంగా జనవాణి అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంటారు. ఇందులో కొన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కానివి వుంటాయి. వాటిని ఫిర్యాదులుగా జనవాణి కార్యక్రమంలో తీసుకుంటారు పవన్‌కళ్యాణ్‌. మంగళవారం ఇదే కార్యక్రమంలో ప్రజల ఇబ్బందులను తెలుసుకుంటున్న సమయంలో పవన్‌కు వెన్నునొప్పి వచ్చింది. కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ కార్యక్రమాన్ని కొనసాగిద్దామని భావించినా నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వెంటనే పవన్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అప్పుడప్పుడు పవన్‌కళ్యాణ్‌ను ఇబ్బంది పెట్టే ఈ వెన్నునొప్పి ఇప్పటిది కాదు. గబ్బర్‌సింగ్‌ సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఒక ప్రమాదం జరిగింది. ఆ టైమ్‌లో వెన్నుపూసలకు గాయమైంది. దానికి చికిత్స తీసుకుంటున్నప్పటికీ అప్పుడప్పుడు తనను ఇబ్బంది పెడుతోందని 2019లో పవన్‌ ఓ సందర్భంలో ప్రకటించారు. దానికి శస్త్ర చికిత్స అనివార్యమని డాక్టర్లు చెప్పినప్పటికీ సంప్రదాయ పద్ధతిలోనే చికిత్స తీసుకుంటున్నారు పవన్‌. ఇప్పుడు మళ్ళీ పవన్‌ను వెన్ను నొప్పి బాధిస్తోందన్న విషయం తెలిసి పవర్‌స్టార్‌ అభిమానులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.