English | Telugu

కనుమరుగుకాకూడదనే వచ్చాను.. సిఎం కి ఆయన పేరుని ప్రతిపాదించాను 

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ 'హరిహర వీరమల్లు'(Harihara Veeramallu)పార్ట్ 1 ఈ నెల 24 న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే. ముందు రోజు ప్రీమియర్ షోస్ కూడా ప్రదర్శిస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పవన్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ లో సందడి నెలకొని ఉంది. 'నిధి అగర్వాల్'(Nidhhi Agerwal)హీరోయిన్ గా చేస్తుండగా అగ్ర నిర్మాత 'ఏఎం రత్నం'(Am Rathnam)సుమారు ఐదు సంవత్సరాలు కష్టపడి 'వీరమల్లు' ని నిర్మించాడు.

రీసెంట్ గా చిత్ర యూనిట్ మీడియాతో సమావేశమయ్యింది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతు 'నేను సినిమా రిలీజ్ కి ముందు మీడియా సమావేశానికి రావడం చాలా అరుదు. కానీ ఏ ఎం రత్నం గారి కోసం వచ్చాను. నిర్మాతగా ఆయన ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొని 'వీరమల్లు' ని నిర్మించారు. అలాంటి నిర్మాత కనుమరుగు కాకూడదని వచ్చాను. మేకప్ మాన్ గా స్టార్ట్ అయిన రత్నం గారు భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగిన సినిమాలు తెరకెక్కించారు. నాతోనే కాకుండా ఎంతో మంది సూపర్ స్టార్స్ తో సినిమాలు తెరకెక్కించి విజయాలు అందుకున్నారు. అలాంటి వ్యక్తి వీరమల్లు విషయంలో ఇబ్బందులు పడటంతో చాలా బాధపడ్డాను. కానీ ఆయన మాత్రం ఎవర్ని ఏమి అనకుండా మౌనంగా ఉంటారు. ఏఎం రత్నం గారిని ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించాలని 'ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు' గారికి నేను ప్రతిపాదించాను.

సినిమా నాకు ప్రాణ వాయువు, అన్నం పెట్టింది. ఇక్కడ నేనైనా, రేపు నా కొడుకు వచ్చినా టాలెంట్ లేకపోతే ఎవ్వరు నిలబడ్డారని పవన్ చెప్పుకొచ్చాడు. దర్శకుడు జ్యోతికృష్ణ(Jyothi Krishna) నిధి అగర్వాల్, ఏఎంరత్నం కూడా మాట్లాడుతు వీరమల్లు తప్పకుండా విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఔరంగజేబుగా కనిపిస్తుండగా, నర్గిస్ ఫక్రి, నోరా ఫతే హి, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.కీరవాణి(Keeravani)సంగీతంలో వచ్చిన అన్ని పాటలు ప్రస్తుతం మారుమోగిపోతున్నాయి. పవన్ తన కెరీర్ లో చేస్తున్న మొట్టమొదటి చారిత్రాత్మక మూవీ వీరమల్లునే. ఈ రోజు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .