English | Telugu

రూ.8 కోట్ల‌తో ప‌వ‌న్ సినిమా తీసేశారా??

ప‌వ‌న్ క‌ల్యాణ్‌... వెంక‌టేష్ - ఇద్ద‌రూ స్టార్ హీరోలే! ప‌వ‌న్ తో సినిమా చేయాలంటే మినిమం రూ.50 కోట్లు పెట్టుబ‌డి పెట్టాల్సిందే. అందుకు వెంకీ కూడా యాడ్ అయ్యాడు. అంటే క‌నీసం రూ.60 కోట్ల బ‌డ్జెట్ వేసుకోవాలి. అలాంటిది ఈ ఇద్ద‌రితో సినిమాని కేవ‌లం రూ.8 కోట్ల‌తో తీసేశారంటే న‌మ్ముతారా...?? కానీ ఇది నిజం. నిర్మాత డి.సురేష్ బాబు మాస్ట‌ర్ మైండ్‌కి ఇదే సాక్ష్యం. గోపాల గోపాల బ‌డ్జెట్ కేవ‌లం రూ.8 కోట్లు! ప‌వ‌న్‌, వెంకీ పారితోషికాలు తీసుకోలేదు. లాభాల్లో వాటా మాత్ర‌మే ఇచ్చారు. శ్రియ‌, రీమేక్ రైట్స్‌, మిగిలిన కాస్ట్ అండ్ క్రూకి పారితోషికాలు, మేకింగ్ కోసం... ఇలా మొత్తానికి రూ.8 కోట్ల‌తో సినిమా తీశారని టాక్‌. ఈ సినిమా మొత్తం 3.4 సెట్స్‌లోనే తీసేశారు. ఆ మూడు సెట్లూ రామానాయుడు స్టూడియోలో వేసిన‌వే. భారీ ఛేజింగులు, ఫైటింగులు లేవు. పాట‌ల‌కూ స్కోప్ లేదు. అందుకే రూ.8 కోట్ల‌తో లాగించేశారు. ఈ సినిమాకి టేబుల్ ప్రాఫిట్ రూ.30 కోట్లు! ఈమ‌ధ్య కాలంలో ఏ తెలుగు సినిమా ఇంత టేబుల్ ప్రాఫిట్ చూడ‌లేదు. అత్తారింటికి దారేది లాభాల శాతం కూడా ఇంత ఎక్కువ‌గా ఏం లేదు. సినిమాకొచ్చిన లాభాల నుంచి వెంకీ, ప‌వ‌న్‌లు త‌మ పారితోషికాలు తీసుకొన్నార్ట‌. వెంకీకి రూ.5 కోట్ల‌కంటే ఎక్కువే గిట్టింది. వెంకీ ఇంత భారీ స్థాయిలో పారితోషికం అందుకోవ‌డం ఇదే తొలిసారి. ఇంత ప‌క్కా ప్లానింగ్ తో సినిమాలు తీసుకొంటే.. నిర్మాత‌ల‌క లాభాలే లాభాలు. ఈ విష‌యంలో సురేష్ బాబుని మెచ్చుకొని తీరాల్సిందే.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .