English | Telugu

ఇజ్రాయెల్‌ లో బాలీవుడ్ హీరోయిన్ మిస్సింగ్!

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ భరుచ్చా మిస్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు ఇజ్రాయెల్ వెళ్లిన ఆమె, అక్కడే చిక్కుకుపోయింది. ప్రస్తుతం ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో అక్కడ బాలీవుడ్ నటి మిస్ కావడం సంచలనంగా మారింది. ఆమె చివరిసారిగా నిన్న మధ్యాహ్నం తన బృందంలోని ఒకరితో మాట్లాడుతూ.. ఓ బేస్‌మెంట్‌లో దాక్కున్నట్లు తెలిపింది. అయితే అక్కడ యుద్ధం కొనసాగుతుండడంతో ఆమెతో బృందానికి కమ్యునికేషన్‌ సంబంధాలు తెగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆమెను ఎక్కడో ఉందో తెలియడంలేదు.

2006 లో వచ్చిన జై సంతోషి మా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నుష్రత్ భరుచ్చా 25కి పైగా సినిమాల్లో నటించింది. ఆమె తెలుగు, తమిళ సినిమాల్లో కూడా మెరిసింది. తెలుగులో శివాజీ సరసన 'తాజ్‌ మహాల్‌'(2010) అనే చిత్రంలో నటించిన ఆమె, తమిళంలో 'వాలిబా రాజా' అనే చిత్రంలో నటించింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.