English | Telugu

ఎన్టీఆర్ ఇంకా బాక్స్ఆఫీస్ 'బాద్‌షా'నే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'రభస' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడడంతో ఎప్పటిలాగే కొన్ని మీడియా ఛానెల్స్ ఆయన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి. టాలీవుడ్ లో ఎన్టీఆర్ పని అయిపోయిందని అంటున్నాయి. ఇతర హీరోలు చేసిన సినిమాలు అవలీలగా 50కోట్ల మార్క్ ను చేరుకొంటుంటే, ఇప్పటికి వరకు ఎన్టీఆర్ కి 45కోట్ల సినిమానే లేదని, అతను నంబర్ రేసులోకి రావడం కష్టమేనని అనేస్తున్నారు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే..టాలీవుడ్ లో మాస్ లో యంగ్ టైగర్ కి వున్న ఫాలోయింగ్ ఎవరికి లేదనే చెప్పాలి.

'రభస' ఇటీవల ఎన్నో అడ్డంకులు దాటుకొని భారీ వర్షాల నడుమ థియేటర్లలోకి వచ్చింది. అయిన మొదటిరోజు తొమ్మిది కోట్ల షేర్ ను రాబట్టి రికార్డ్ ను సృష్టించింది. అలాగే అమెరికాలో రామ్ చరణ్ 'ఎవడు' సినిమా టోటల్ రన్ లో సాధించిన వసూళ్ళను ఎన్టీఆర్ 'రభస' తొలి మూడు రోజుల్లోనే రాబట్టింది.

గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా వరుస పరాజయాలు వచ్చినప్పుడు ఇలాగే కొంతమంది పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తే మంచిదని ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. కానీ పవర్ స్టార్ 'గబ్బర్ సింగ్' సినిమాతో తిరిగి రికార్డులు బద్దలుకొట్టి 'అత్తారింటికి దారేది'తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త చరిత్ర సృష్టించాడు.

అలాగే మహేష్ బాబు కూడా 'పోకిరి' తరువాత కష్టకాలన్ని ఎదురుకొన్నాడు. పోకిరి విజయం కూడా ఏదో అదృష్టం బాగుండి దక్కిందని అన్నారు. ఆ తరువాత మళ్ళీ 'దూకుడు' సినిమాతో తన సూపర్ స్టార్ రెంజును చూపించాడు మహేష్. ఇప్పుడు టాలీవుడ్ లో వరుస విజయాలతో ఆగకుండా ముందుకు దూసుకేళ్తున్నాడు.

ఇవన్ని ఎ౦దుకండీ తెలుగు సినిమా ఇండస్ట్రీకే మెగాస్టార్ గా పిలువబడే చిరంజీవినే, ఒకప్పుడు వరుస ఫ్లాపులు వేధించాయి. ఆ తరువాత మళ్ళీ మెగాస్టార్ వరుస సక్సెస్ లతో తన స్టార్ పవర్ ని రుచిచూపించాడు. అదీ మాస్ లో భీభత్సమైన ఫాలోయింగ్ వున్న హీరోల పవరంటే.


ఎన్ని వరుస పరాజయాలు ఎదురైన కూడా సూపర్ స్టార్ లు ఒక్క హిట్ తో తమ స్థానాన్ని చేరుకోగలరు. అలాగే యంగ్ టైగర్ కూడా త్వరలో ఒక్క హిట్ తో తన స్థానాన్ని చేరుకోగలడు. తిరిగి నెంబర్ వన్ రేసులోకి రాగలడు. ఎనీ డౌట్స్..!!!!!

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.