English | Telugu

'యంగ్ టైగర్' 'కింగ్' కాంబినేషన్ కి టైముంది.!

టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున ప్రస్తుతం సోలో హీరోగా నటించడానికి అంతగా ఆసక్తి చూపించట్లేదు. ఆయన కొత్త పాత్రలపై దృష్టిపెట్టబోతున్నాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి మరో మల్టీస్టారర్ లో నటిస్తున్నాడని సమాచారం.. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయబోయే ఈ సినిమాతో నాగార్జున కొత్తగా కనిపిస్తాడని టాలీవుడ్ టాక్. కాకపోతే ఈ చిత్రం మొదలు కావడానికి ఇంకా టైమ్‌ పడుతుందట. అప్పటివరకు ఖాళీగా వుండడం ఎందుకని నాగార్జున ఓ కొత్త దర్శకుడికి ఓకే చెప్పారట. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో పి. రామ్‌ మోహన్‌ దీనిని నిర్మిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.