English | Telugu

ఎన్టీఆర్ ఏ వంటకంలో స్పెషలో తెలుసా! 

ఎన్టీఆర్(Ntr),హృతిక్ రోషన్(Hrithik Roshan)ల అప్ కమింగ్ మూవీ 'వార్ 2 '(War 2)కి సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రంగా కూడా వార్ 2 క్రేజ్ ని సంపాదించుకుంది. తెలుగులో అతి త్వరలోనే భారీఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా, తాజాగా ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ కలిగిన 'ఎస్కైర్'(Esquire)మ్యాగజైన్ ఎన్టీఆర్ ని తమ ముఖచిత్రంగా ప్రచురించింది. అందులో భాగంగా సదరు 'ఎస్కైర్ మ్యాగజైన్' కి ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఆ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతు వార్ కోసం లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా అన్ని పరిశ్రమల వారు పని చేసారు. ఇకపై టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ అనేది లేదు. మనమంతా భారతీయ చిత్ర పరిశ్రమకి చెందిన వాళ్ళం. ఆ దిశగానే సినిమాలు తెరకెక్కాలి. సినిమా హిట్ అవ్వడానికి ప్రత్యేక ఫార్ములా అంటూ ఉండదు.నేను వార్ 2 చెయ్యడానికి ప్రధాన కారణం స్క్రిప్ట్. చాలా బలమైన కథ,కథనంతో రూపొందింది. నా పర్సనల్ విషయాలకి వస్తే నా భార్య ప్రణతి, స్నేహితుల కోసం వంట చెయ్యడం చాలా ఇష్టం. ఈ విషయంలో నేను గొప్ప చెఫ్ ని. పునుగులు బాగా వేస్తాను. బిర్యానీ కూడా బాగా వండుతాను. జీవితంలో ఏది ప్లాన్ చేసుకునే అలవాటు లేదు. వచ్చిన అవకాశాన్ని మాత్రం ఉపయోగించుకుంటానని తెలిపాడు.

స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న 'వార్ 2 'ని అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్(Yash Raj Films)నిర్మించగా హిట్ చిత్రాల దర్శకుడు 'అయాన్ ముఖర్జీ'(Ayan Mukerji)తెరకెక్కించాడు. కియారా అద్వానీ హీరోయిన్ కాగా అనిల్ కపూర్, అశుతోష్ రానా, దిషిత సెహగల్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. టాప్ హీరోయిన్ అలియాభట్(Alia Bhatt) క్యామియో అప్పీరియన్స్ ఇవ్వనుంది. తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ అత్యధిక థియేటర్స్ లో విడుదల చేస్తుంది.


టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.