English | Telugu

డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఎన్టీఆర్ శ్రీలంక పయనం! కారణం ఇదేనా!


-ఎన్టీఆర్ నుంచి వస్తున్న కొత్త న్యూస్ ఏంటి!
-ఫ్యాన్స్ కోరిక నెరవేరిందా!
-డ్రాగన్ ఓకే నా!
-శ్రీలంక ఎవరెవరు వెళ్తారు

పాన్ ఇండియా ప్రేక్షకులే కాదు పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్స్ కూడా కొన్ని సినిమాల రిలీజ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటాయి. అలాంటి ఒక చిత్రమే మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr),సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel)కలయికలో రూపొందుతున్న ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్. చిత్ర బృందం అధికారకంగా ప్రకటించకపోయినా'డ్రాగన్'(Dragon)అనే పేరు ప్రచారంలో ఉంది. ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గట్టుగా డ్రాగన్ టైటిల్ బాగుందని అదే పేరుని కంటిన్యూ చెయ్యమని సోషల్ మీడియా వేదికగా కోరుతు వస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ గత కొన్ని రోజులుగా చిత్ర బృందం వెల్లడి చెయ్యడం లేదు. దీంతో మూవీకి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తుందేమో అని కూడా అభిమానులు సోషల్ మీడియా వేదికగా సెర్చ్ చేస్తున్నారు..ఈ క్రమంలోనే ఒక న్యూస్ వాళ్ళ కంట పడింది.


కొన్ని రోజుల క్రితం హైదరాబాద్(Hyderabad)లో షూటింగ్ ప్రారంభమైందని,ఈ నెల చివరకి సదరు షెడ్యూల్ పూర్తి అవుతుంది. డిసెంబర్ఫస్ట్ వీక్ లో నెక్స్ట్ షెడ్యూల్ శ్రీలంక(Srilanka)లో ప్రారంభం కాబోతుంది. ఎన్టీఆర్ తో పాటు మిగతా నటీనటులుపై కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఈ న్యూస్ లో నిజమెంత ఉందో తెలియదు కానీ ఫ్యాన్స్ లో మాత్రం జోష్ ని నింపుతుంది. ప్రశాంత్ నీల్ చిత్రాల్లో హీరో తన మాస్ విశ్వరూపాన్ని చూపించడంలో ఏ మాత్రం వెనుకాడడు. మరి మాస్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిన ఎన్టీఆర్ ని ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ లో చూపిస్తాడనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఉంది. చిత్ర కథపై కూడా అందరిలో క్యూరియాసిటీ నెలకొని ఉంది.


also Read:ఐదు నెలల సమయం మాత్రమే!.. జై హనుమాన్ కీలక అప్ డేట్ ఇదేనా!

ఈ ప్రాజెక్ట్ కి కేజిఎఫ్ ఫేమ్ రవి బస్సుర్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. ఎన్టీఆర్ తో కాంతార చాప్టర్ 1 ఫేమ్ 'రుక్మిణి వసంత్'( జత కడుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్,మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. జూన్ 25 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ ఎంట్రీ ని దక్కించుకోనుంది.


టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.