English | Telugu

ఎన్టీఆర్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ డిమాండ్ వింటే మైండ్ బ్లాక్!

మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr),'ప్రశాంత్ నీల్'(Prashanth Neel)కాంబినేషన్ లో అగ్ర చిత్రనిర్మాణ సంస్థలు ఎన్టీఆర్ ఆర్ట్స్(Ntr Ats),మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)నిర్మిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్, ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ ని జరుపుకుంది. ఎన్టీఆర్ పై పలు కీలక సన్నివేశాలని కూడా చిత్రీకరించారు. 'ఆర్ఆర్ఆర్', 'దేవర' తో పాన్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్ ఇమేజ్ మరింత పెరగడం, కేజిఎఫ్ చాప్టర్ 1 ,చాప్టర్ 2 ,సలార్ తో ప్రశాంత్ నీల్ కూడా తన సత్తా చాటడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను ఈ ఇద్దరి కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ మూవీకి సంబంధించి 'ప్రశాంత్ నీల్' భారీ రెమ్యునరేషన్ తో పాటు చిత్ర లాభాల్లో యాభై శాతం డిమాండ్ చేసినట్టుగా ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. సలార్ టైంలో కూడా ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకే నిర్మాతలు మందు ఆ డిమాండ్ ఉంచాడని, మైత్రి, ఎన్టీఆర్ సంస్థలు కూడా అందుకు ఒకే ఆన్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మైత్రి మూవీ మేకర్స్ కి లాభాల్లో 25 శాతం వాటా, ఎన్టీఆర్ 100 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు 25 శాతం వాటా తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.'

సప్త సాగరాలుదాటి మూవీ ఫేమ్ 'రుక్మిణి వసంత్'(Rukmini Vasanth)హీరోయిన్ గా చేస్తుండగా భారతీయ చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు అగ్ర నటులు సిల్వర్ స్క్రీన్ ని షేర్ చేసుకోనున్నారు. వచ్చే సంవత్సరం జనవరి 9 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుండగా, 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక ఎన్టీఆర్ ఆగస్టు 14 న విడుదల కాబోతున్న 'వార్ 2'(War 2)కి సంబంధించిన ప్రమోషన్స్ పూర్తయ్యాక ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో పాల్గొంటాడు. 'వార్ 2 'ద్వారా ఎన్టీఆర్ ఫస్ట్ టైం బాలీవుడ్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించిన హక్కులని సితార ఎంటర్ టైన్ మెంట్స్ పొందింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .