English | Telugu

‘దేవర’లోని రెండో పాట గురించి రామజోగయ్యశాస్త్రి ఏం చెప్పారంటే..!

ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. ఎంతో ప్రెస్టీజియస్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మేకర్స్‌. ఇందులో జాన్వీ కపూర్‌ ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. ఈ సినిమా రిలీజ్‌కి దాదాపు రెండు నెలలు సమయం ఉంది. దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎప్పటికప్పుడు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌ అందర్నీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక మొదటి పాట సెన్సేషనల్‌ హిట్‌ అయింది. ఈ పాట విడుదలై చాలా రోజులైంది. ఎప్పటి నుంచో రెండో పాట కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారంతా.

ఈ సినిమాలోని రెండో పాట మెలోడీగా సాగే డ్యూయెట్‌ అని తెలుస్తోంది. ఈ పాటకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి. ఈ సినిమాలో జాన్వీకపూర్‌ క్యారెక్టర్‌ పేరు తంగం. అందుకే ఆమె పేరు వచ్చే విధంగానే పాట ఉంటుందనే హింట్‌ ఇచ్చారు. ‘తంగం అంతరంగం హాయిగా ఉయ్యాలూగుతున్నట్టుంది.. ఇప్పుడే విన్నా.. త్వరలోనే వచ్చేస్తుందిలే..’ అంటూ ఈ ఎంతో శ్రావ్యంగా సాగుతుంది అనే విషయాన్ని తెలిపారు. ఈ కొత్త అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పాటకు అనిరుధ్‌ ఎలాంటి ట్యూన్‌ ఇచ్చాడో, మ్యూజికల్‌గా ఈ పాట ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో, అభిమానుల్లో నెలకొంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.