English | Telugu

ఇండియన్ సినిమాకి రాజా సాబ్.. అడుగుపెడితే రికార్డులు షేక్...

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమా రిలీజ్ అయితే బాక్సాఫీస్.. సినిమా అప్డేట్ వస్తే సోషల్ మీడియా షేక్ అవ్వడం కామన్. ఇటీవల 'కల్కి' (Kalki 2898 AD) సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేసి, మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న ప్రభాస్.. ఇప్పుడు 'రాజా సాబ్' మూవీ గ్లింప్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు.

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న క్రేజీ మూవీ 'రాజా సాబ్' (Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ కలర్ ఫుల్ గా ఉంది. ప్రభాస్ వింటేజ్ లుక్ లో ఛార్మింగ్ గా కనిపించాడు. 'డార్లింగ్' సినిమా రోజులను గుర్తు చేశాడని చెప్పవచ్చు. గ్లింప్స్ లో బైక్ మీద స్టైల్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. చేతిలో ఫ్లవర్ బొకే పట్టుకొని లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు. ఇక పార్క్ చేసి ఉన్న కారు దగ్గరకు వెళ్లి.. అద్దంలో చూసుకుంటూ తనకి తాను దిష్టి తీసుకోవడం భలే క్యూట్ గా ఉంది.

'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్.. ఎక్కువగా భారీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. దీంతో వింటేజ్ డార్లింగ్ ని బిగ్ స్క్రీన్ మీద చూడాలని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆశపడుతున్నారు. ప్రేక్షకుల ఆశను నిజం చేయడం కోసమే.. 'రాజా సాబ్' సినిమా చేస్తున్నట్టున్నాడు ప్రభాస్. తాజాగా విడుదలైన గ్లింప్స్.. ఫ్యాన్స్ తో పాటు అందరినీ ఫిదా చేసింది. అందుకే ఈ గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే 20 మిలియన్ డిజిటల్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుత జోరు చూస్తుంటే.. సంచలన వ్యూస్ తో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనిపిస్తోంది. గ్లింప్స్ కే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందంటే.. ఇక సినిమా విడుదలైతే బాక్సాఫీస్ దగ్గర ఊహించని వండర్స్ క్రియేట్ చేస్తుంది అనడంలో సందేహం లేదు.

"రాజా సాబ్" మూవీ హారర్ రొమాంటిక్ కామెడీ జానర్ లో రూపొందుతోడ్ని. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తయింది. ఆగస్టు 2 నుంచి మరో భారీ షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.