English | Telugu

‘భారతీయుడు2’ తర్వాత శంకర్‌ ముందున్న రెండు పెద్ద టాస్క్‌లు ఇవే!

యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్‌, శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘భారతీయుడు’ అప్పట్లో ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దాదాపు 28 సంవత్సరాల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్‌గా ‘భారతీయుడు2’ ఇటీవల విడుదలైంది. అప్పుడు ‘భారతీయుడు’ చిత్రానికి బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులే ఈ సీక్వెల్‌ను తిప్పి కొట్టారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా భారీ నష్టాన్నే చవిచూస్తోంది. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘భారతీయుడు3’ కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు. చెప్పినట్టుగానే ‘భారతీయుడు2’లో మూడో భాగానికి సంబంధించిన 5 నిమిషాల ట్రైలర్‌ను కూడా జోడిరచారు. దాన్ని బట్టి మూడో భాగం షూటింగ్‌ కూడా చాలా భాగం పూర్తయిందని అర్థమవుతోంది. మిగతా షూటింగ్‌ కూడా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్‌లో చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌.

‘భారతీయుడు2’ కారణంగా పక్కన పెట్టిన రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ను మళ్ళీ పట్టాలెక్కించి దాన్ని పూర్తి చేసేందుకు రెడీ అయ్యాడు శంకర్‌. ‘భారతీయుడు2’ రిజల్ట్‌ చూసిన తర్వాత చరణ్‌ ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. తమ హీరో సినిమాని శంకర్‌ ఎలా తీసివుంటాడు అనే ప్రశ్న వేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు శంకర్‌ ముందు రెండు పెద్ద టాస్క్‌లు ఉన్నాయి. ‘గేమ్‌ ఛేంజర్‌’తో హిట్‌ కొట్టి మెగా ఫ్యాన్స్‌ని ఖుష్‌ చెయ్యాలి. అలాగే ‘భారతీయుడు2’తో నిరాశపడిన కమల్‌హాసన్‌ అభిమానులు, తన అభిమానుల్ని సంతృప్తిపరచాలి. ఇప్పుడు ఈ రెండు అంశాలనే దృష్టిలో పెట్టుకొని శంకర్‌ వర్క్‌ చేస్తున్నాడని సమాచారం. ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ తర్వాత ‘భారతీయుడు3’పై దృష్టి పెట్టబోతున్నాడు. మరి శంకర్‌ ఈ రెండు సినిమాలను జనరంజకంగా ఎలా మలుస్తాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.