English | Telugu

డీజే టిల్లు సిద్ధుకి అవకాశాలు ఎలా వస్తున్నాయో ఆ హీరో చెప్పిన విషయంతో అర్ధమైంది


జొన్నలగడ్డ సిద్దు ప్రస్తుతం తెలుసు కదా అనే మూవీని చేస్తున్నాడు. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ మూవీ డైరెక్టర్ గా నీరజకి ఫస్ట్ మూవీ. సిద్దు సరసన రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి లు హీరోయిన్లుగా చేస్తున్న ఈ సినిమాని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. తాజాగా ఈ మూవీ సిద్దు కి ఎలా వచ్చిందనే విషయం మీద సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

సిద్దు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జట్ తో రూపొందుతున్న ఈ చిత్రం యొక్క షూటింగ్ రెగ్యులర్ గా జరుపుకుంటుంది. నీరజ కోన ఈ సినిమాకి హీరోగా సిద్దు నే ఎంచుకోవడానికి ప్రధాన కారణం ప్రముఖ హీరో నితిన్. అవును నితినే మీ సినిమా కథ కి సిద్దు బాగుంటాడని నీరజ కి చెప్పడంతో సిద్దు ఈ సినిమాకి హీరో అయ్యాడు. ఒకసారి నితిన్ మారెడుమిల్లిలో తన సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు నీరజ కూడా నితిన్ వెంటే ఉంది. షూటింగ్‌‌కు గ్యాప్ లో ఇద్దరు రిలాక్స్ అవుతున్న టైంలో సిద్దు నటించిన డీజే టిల్లు సినిమా టీవీలో వస్తు ఉంది. సినిమా మొత్తం చూసిన నితిన్ నీరజతో నువ్వు తెరకెక్కించబోయే సినిమా కథ సిద్దు కి సూట్ అవుతుందని చెప్పాడు. అలాగే అంతటితో ఆగకుండా సిద్దుకి ఫోన్ చేసి నీరజ దగ్గర కథ ఉంది నీకు చాలా బాగుంటుందని నితిన్ చెప్పాడు.ఆ విధంగా సిద్దు కొత్త చిత్రం తెలుసు కదా ప్రారంభం అయింది.

ఈ విషయాలన్నీ నితిన్ కొత్త చిత్రం ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బయటకి వచ్చాయి.ఆ మూవీ ప్రమోషన్స్ లో సిద్దు తో కలిసి నితిన్ తన కొత్త సినిమా అనుభవాలని పంచుకున్నాడు. అలాగే సినిమా కూడా చాలా అధ్బుతంగా వచ్చిందని అందరం కూడా చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నామని కూడా నితిన్ చెప్పుకొచ్చాడు. వీరిద్దరి మధ్యన జరిగిన ఫన్నీ ఎపిసోడ్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.