English | Telugu

ప్రజాస్వామ్యం బతికే ఉందంటు తెలివిగా గెలిచిన ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్పిన టాప్ హీరో

హీరో నిఖిల్ సినీ కెరియర్ ప్రస్తుతం ఉచ్చ స్థితిలో కొనసాగుతు ఉంది. కార్తికేయ 2 తో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ అనే ఒక పీరియాడిక్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలోని తన క్యారక్టర్ కి సంబంధించి కత్తి విన్యాసాలని కూడా నేర్చుకుంటున్నాడు.ఈ సినిమానే కాకుండా మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లు నిఖిల్ చేతిలో ఉన్నాయి. తాజాగా నిఖిల్ తన ట్విట్టర్ లో చేసిన పోస్ట్ ఒకటి సంచలనం సృష్టిస్తుంది.

నిన్న తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి.రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్బుతమైన మెజారిటీ ని సాధించి తెలంగాణలో అధికారాన్ని సంపాదించింది. ఇప్పుడు ఈ విషయంలో రేవంత్ రెడ్డి కి కంగ్రాట్స్ చెప్తు నిఖిల్ తన ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసాడు. తెలంగాణ రాష్ట్రంలో అఖండ విజ‌యం సాధించిన కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి అన్న‌కు కంగ్రాట్స్‌ అంటు నిఖిల్ చేసిన ఆ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

అలాగే తెలంగాణతో పాటు ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ ,మధ్యప్రదేశ్ లో జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా విడుదల అయ్యాయి. తెలంగాణ ని మినహాయించి మిగతా మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి మోగించింది. మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీకి అభినంద‌న‌లు. ప్రజాస్వామ్యం సజీవంగా ఉంది. జై హింద్.’ అంటూ నిఖిల్ తన ఎక్స్ లో రాసుకొచ్చాడు. నిఖిల్ చాలా తెలివిగా తన మీద ఒక పార్టీ ముద్ర పడకుండా కాంగ్రెస్, బీజేపీ ఇద్దరికి శుభాకాంక్షలు చెప్పడంతో నిఖిల్ తెలివితేటల్ని అందరు మెచ్చుకుంటున్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.