English | Telugu

బాబాయ్ అని పిలిస్తే దబిడి దిబిడే.. సంచలనంగా మారిన బాలయ్య కామెంట్స్!

తనని ఎవరైనా బాబాయ్ అని పిలిస్తే, దిబిడి దిబిడే అంటూ నందమూరి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. కానీ ఇది ఆయన సీరియస్ గా ఇచ్చిన వార్నింగ్ కాదు, సరదాగా ఇచ్చిన వార్నింగ్. అయితే బాలయ్య వార్నింగ్ ఎలా ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం ఈ మాట మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాలకృష్ణ రీసెంట్ మూవీ 'భగవంత్ కేసరి' బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం గ్రాండ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "వయసులో నన్ను ఎవరైనా బాబాయ్ అనో, ఇంకేదో అనో పిలిస్తే.. జాగ్రత్తగా ఉండండి.. దబిడి దిబిడే అంటాను. అలాంటిది ఈ సినిమాలో శ్రీలీలకి చిచ్చాగా చేశాను. ఈ చిత్రంలో మంచి సందేశముంది. ఇలాంటి కథని చెప్పడం బాధ్యతగా తీసుకొని, ఈ పాత్రను అంగీకరించడం జరిగింది" అని బాలకృష్ణ అన్నారు.

అయితే "వయసులో నన్ను ఎవరైనా బాబాయ్ అని పిలిస్తే" అంటూ బాలకృష్ణ సరదాగా మాట్లాడిన మాటలను.. కొందరు "వయసులో" అనే పదాన్ని తీసేసి పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ ని అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. దీంతో నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.