English | Telugu

భూ వివాదంలో రాఘవేంద్రరావు... హైకోర్టు నోటీసులు!

హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు గతంలో ప్రభుత్వం కొందరికి భూములను కేటాయించింది. స్టూడియోల నిర్మాణం, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌కి సంబంధించిన స్టూడియోల నిర్మాణ నిమిత్తం ఆ భూములను కేటాయించారు. అయితే ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే భూములను కేటాయించిందో.. దానికి కాకుండా మరోలా ఆయా భూములను వినియోగిస్తే చట్టపరంగా వారిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది.

ఇప్పుడు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కోర్టు నుంచి అలాంటి నోటీసునే అందుకున్నారు. రికార్డింగ్‌, రీరికార్డింగ్‌ థియేటర్లను నిర్మించేందుకు కేటాయించిన భూమిని రాఘవేంద్రరావు సొంత అవసరాలకు వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిల్‌పై స్పందించిన హై కోర్టు రాఘవేంద్రరావుకు, ఆయన బంధువులకు నోటీసులు జారీ చేసింది. గతంలో ఓసారి నోటీసులు జారీ చేసినా.. అవి వారికి అందినట్టుగా రికార్డుల్లో లేకపోవడంతో మళ్లీ నోటీసులు జారీ చేశారు. మెదక్‌కు చెందిన బాలకిషన్‌ అనే వ్యక్తి 2012లో ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సర్వే నెం.403/1లోని 2 ఎకరాల భూమిని ఆర్‌.కె.సినీప్లెక్స్‌ పేరుతో వాణిజ్య అవసరాలకు వినయోగించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరథే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌ కుమార్‌లతో కూడిని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రతివాదులైన రాఘవేంద్రరావు, ఆయన బంధువులు కృష్ణమోహన్‌రావు, చక్రవర్తి, విజయలక్ష్మి, అఖిలాండేశ్వరి, లాలస దేవికి నోటీసులిచ్చింది. అనంతరం విచారణ కోసం న్యాయస్థానం జనవరి 18కి వాయిదా వేసింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.