English | Telugu

కృష్ణ విగ్రహం.. కమల్ హాసన్ కి థాంక్స్ చెప్పిన మహేష్!

విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఆవిష్కరించారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఇండియన్-2' షూటింగ్ కోసం కమల్ విజయవాడ వచ్చారు. ఈ క్రమంలో గురునానక్‌ కాలనీలోని కేడీజీవో పార్కులో ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహాన్ని శుక్రవారం ఉదయం ఆయన ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో దేవినేని అవినాష్ తో పాటు కృష్ణ, మహేష్ బాబు అభిమానులు కూడా పెద్దఎత్తున పాల్గొన్నారు.

తన తండ్రి కృష్ణ విగ్రహాన్ని కమల్ హాసన్ ఆవిష్కరించడం పట్ల మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. "విజయవాడలో కృష్ణగారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైనందుకు కమల్ హాసన్ గారికి, దేవినేని అవినాష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించడం నిజంగా గర్వకారణం, ఆయన వదిలి వెళ్లిన వారసత్వానికి నివాళులు. అలాగే, ఈ ఈవెంట్‌ను సాధ్యం చేసిన అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు." అని మహేష్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.