English | Telugu

నిత్యా మీనన్‌ పెళ్ళి... సెక్యూరిటీ అవసరం లేదట!

పెళ్ళి విషయంలో అమ్మాయిలకు ఒక స్థిరమైన అభిప్రాయం ఉంటుంది. అందులోనూ సినిమా తారలకు రిక్వైర్‌మెంట్స్‌ కాస్త ఎక్కువగా ఉంటాయి. దానికి తగ్గ అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు కోరుకున్న వారు దొరక్కపోవడం వల్ల, మరి కొన్ని కారణాల వల్ల సినిమా హీరోయిన్లు పెళ్ళి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయిన వారు చాలా మందే ఉన్నారు. ఆ లిస్ట్‌లో నిత్యా మీనన్‌ కూడా చేరుతుందా? అని కొన్నాళ్ళ వరకు అందరూ అనుకున్నారు. ఎందుకంటే పెళ్ళి గురించి ఆ తరహా కామెంట్స్‌ గతంలో చేసింది నిత్య. అందుకే అందరూ అలా ఫిక్స్‌ అయ్యారు.

అయితే తాజాగా పెళ్ళి గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ‘నేను ఒక ట్రెడిషనల్‌ అమ్మాయిని, మన సంస్కృతి అంటే నాకు చాలా గౌరవం. పెళ్ళి విషయంలో నాకు ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉంది. ప్రస్తుతం నాకు అలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. అంతకుమించి ఎవరైనా ఆలోచించేవారు దొరికితే తప్పకుండా పెళ్ళి చేసుకుంటాను’ అంటూ క్లారిటీ ఇచ్చింది నిత్యా మీనన్‌.

నిత్యా మీనన్‌ సినిమాల్లోనే కాదు, వెబ్‌ సిరీస్‌లలో, టీవీ షోల్లోనూ తన ప్రతిభ చాటుకుంటోంది. ‘బ్రీత్‌.. ఇన్‌ టు ద షాడోస్‌’, ‘మోడర్న్‌ లవ్‌ హైదరాబాద్‌’ వెబ్‌ సిరీస్‌లలో నటించిన నిత్యా ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా ఆకట్టుకుంటోంది. తెలుగులో ఇండియన ఐడల్‌ షోకి హోస్ట్‌గా వ్యవహరించింది. ‘స్కైలాబ్‌’ చిత్రంతో నిర్మాతగా మారిన నిత్యా ప్రస్తుతం ‘కుమారి శ్రీమతి’ వెబ్‌ సిరీస్‌ చేస్తోంది. అంతర్జాతీయంగా వెబ్‌ వీక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో ఇండియన ఐడల్‌ షోకి హోస్ట్‌గానూ వ్యవహరించింది. అలాగే మలయాళ వెబ్‌ సిరీస్‌ ‘మాస్టర్‌ పీస్‌’లో కూడా నటించింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.