English | Telugu

నాగార్జున "రాజన్న" కథ ఇదే

నాగార్జున"రాజన్న" కథ ఇదేనని ఆయనే స్వయంగా తెలుగువన్ కి తెలియజేశారు. వివరాల్లోకి వెళితే తెలంగాణాలోని నేలకొండపల్లి అనే గ్రామంలో మల్లమ్మ ( ఏన్నీ) అనే పాపను ఆ గ్రామ ప్రజలు ప్రాణంలా చూసుకుంటారు. ఎందుకంటే ఆ పాప బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తన స్వగ్రామానికి వస్తే, అక్కడ ఇంకా స్వాతంత్ర్యం రాకపోగా, రజాకార్లు, దొరలు ప్రజలను ఏ విధంగా హింసిస్తున్నారో గమనించి, వారిలో తిరుగుబాటు వచ్చేలా చేస్తాడు.

ఆ ప్రయత్నంలో భాగంగా తన ప్రాణాలను పోగొట్టుకున్న యోధుడు "రాజన్న" కూతురే ఈ మల్లమ్మ. "రాజన్న" కూతురే మల్లమ్మ అని తెలిస్తే దొరలు చంపేస్తారని ఆ విషయం ఎవరికీ తెలియకుండా మల్లమ్మను పెంచుతూంటారు. ఆ తర్వాత మల్లమ్మ ఏం చేసిందీ, "రాజన్న" కూతురని ఎలా అనిపించుకుందీ అన్నది మిగిలిన కథ. ఈ నాగార్జున "రాజన్న" చిత్రం డిసెంబర్ 22 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతూంది.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.