English | Telugu

ప‌వ‌న్ అత్త‌తో.. వెంకీ ఏం చేస్తాడు?

అత్తారింటికి దారేదితో మ‌ళ్లీ తెర‌పైకొచ్చింది న‌దియా. ఆ త‌ర‌హా పాత్ర‌ల్లో సూటైపోతాన‌ని నిరూపించుకొంది. దృశ్యం సినిమాలోనూ త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకొంది. పెద్ద‌రికం, హుందాత‌నం క‌ల‌బోసిన పాత్ర‌ల‌కు ఆమె సూటైపోతుంద‌ని ద‌ర్శ‌కులూ భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు అలాంటి మ‌రో అవకాశం ద‌క్కింది. వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా వారాహి చ‌ల‌న చిత్రం సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించాల‌ని భావిస్తోంది. చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. ఈ సినిమాలో వెంక‌టేష్ స‌ర‌స‌న న‌దియా న‌టించ‌నుంద‌ని స‌మాచార‌మ్‌. 40లో ప‌డిన భార్యాభ‌ర్త‌ల క‌థ ఇది. వారి మ‌ధ్య జ‌రిగే సంఘ‌ట‌న‌లు, వారి మ‌ధ్య బంధాలూ.. ఈ క‌థ‌కు బ‌లం. ఈ సినిమాలో మ‌రో యువ జంట కూడా ఉంద‌ట‌. అందుకోసం నూత‌న న‌టీన‌టుల‌ను ఎంచుకోవాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. దృశ్యంలానే.. ఇది కూడా ఓ కొత్త క‌థ అట‌. హీరో అంటే యాభై దాటినా ప‌ద‌హారేళ్ల అమ్మాయిల‌తో డ్యూయెట్లు పాడాల‌ని చూస్తున్న ఈ త‌రుణంలో వెంకీ ఆ మూస నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. కొత్త దారిలో న‌డ‌వ‌డం ఆద‌ర్శ‌ప్రాయ‌మే. మ‌రి ప‌వ‌న్ అత్త‌తో వెంకీ చేసే రొమాన్స్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.