English | Telugu

చ‌ర‌ణ్ కాద‌న్నాడు.. బ‌న్నీ ఔన‌న్నాడు

రామ్‌చ‌ర‌ణ్‌తో ఓ సినిమా చేయాల‌ని బోయ‌పాటి శ్రీ‌ను ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నిస్తున్నాడు. రెండు మూడు క‌థ‌లు రెడీ చేసుకొన్నాడు కూడా. చిరు, చ‌ర‌ణ్‌ల‌కూ వినిపించాడు. అయితే ఆ ప్రాజెక్టు కార్య‌రూపం దాల్చ‌లేదు. దాంతో లెజెండ్ లాంటి హిట్ త‌ర‌వాత కూడా బోయ‌పాటి ఖాళీగా ఉండాల్సివ‌చ్చింది. ఇప్పుడు మరో మెగా హీరోతో సినిమాని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. ఆ హీరోనే... అల్లు అర్జున్‌. ఔను... బ‌న్నీ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. ఈ విష‌యాన్ని బోయ‌పాటి శ్రీ‌ను కూడా ధృవీక‌రించాడు. వ‌చ్చే యేడాది మార్చిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించ‌నుంది. అల్లు అర్జున్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. మార్చిలో పూర్త‌వుతుంది. ఆ త‌ర‌వాత బోయ‌పాటి శ్రీ‌ను సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. చ‌ర‌ణ్ నో చెప్పిన క‌థే బ‌న్నీ తో తీస్తున్నార‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో టాక్‌. మ‌రి చ‌ర‌ణ్‌, బ‌న్నీ తీసుకొన్న నిర్ణ‌యాల్లో ఏది క‌రెక్టో తెలియాలంటే మ‌రో యేడాదైనా ఆగాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.