English | Telugu

హీరోగా దేవిశ్రీ ప్రసాద్ ఎంట్రీ.. స్టార్స్ ని దాటుకొని వచ్చిన బిగ్ ప్రాజెక్ట్!

'ప్రతి అన్నం మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది' అంటారు. అలాగే, ప్రతి కథ ఏ నటుడి దగ్గరకు వెళ్ళాలనేది ముందే రాసి ఉంటుంది అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపించే మాట. ఇప్పుడు టాలీవుడ్ లో ఓ కథ ఎందరో హీరోలను దాటుకొని దేవిశ్రీ ప్రసాద్ దగ్గరకు చేరినట్లు తెలుస్తోంది. ఈ కథతో ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. (Devi Sri Prasad)

కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 'బలగం' విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొంది.. ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత నాని హీరోగా 'ఎల్లమ్మ' అనే సినిమాని ప్రకటించాడు వేణు. అయితే నాని ఇతర సినిమాలతో బిజీ అవ్వడంతో.. ఈ ప్రాజెక్ట్ లోకి నితిన్ వచ్చాడు. ఆ తర్వాత నితిన్ నుంచి శర్వానంద్ కి, అటు నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ కి ఈ ప్రాజెక్ట్ వెళ్ళినట్లు వార్తలు వినిపించాయి. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. (Yellamma)

ఎన్నో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ తో సంగీతం దర్శకుడిగా గొప్ప పేరు సంపాదించుకున్న దేవిశ్రీ ప్రసాద్.. హీరోగా ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు కొన్నేళ్ల క్రితం వార్తలొచ్చాయి. కానీ, ఎందుకనో అది జరగలేదు. అలాంటిది ఇప్పుడు ఎందరో హీరోలను దాటుకొని వచ్చిన 'ఎల్లమ్మ' కథతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా న్యూస్ వినిపిస్తుంది. అదే నిజమైతే హీరోగా దేవిశ్రీ ప్రసాద్ కి సాలిడ్ ఎంట్రీ దొరికినట్లే.

'ఎల్లమ్మ' సినిమా దిల్ రాజు ప్రొడక్షన్స్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ హీరోయిన్ విషయంలోనూ సస్పెన్స్ నెలకొంది. సాయిపల్లవి, కీర్తి సురేష్ వంటి పేర్లు వినిపించాయి. మరి ఫైనల్ గా ఎవరి దగ్గరికి వెళ్తుందో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.