English | Telugu

ఆగస్ట్ 19 న ముగ్గురు విడుదల

ఆగస్ట్ 19 న ముగ్గురు విడుదల కానుందని ఈ చిత్రం యూనిట్ తెలిపింది. వివరాల్లోకి వెళితే ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, నవదీప్, అవసరాల శ్రీనివాస్, "హ్యాపీడేస్" ఫేం రాహుల్ హీరోలుగా, రీమాసేన్, శ్రద్ధా దాస్, సంజన, సౌమ్య హీరోయిన్లుగా, నాగేంద్ర.వి.ఆదిత్య (వి.యన్.ఆదిత్య) దర్శకత్వంలో, మూవీ మొగల్ డాక్టర్ డి.రామానాయుడు నిర్మిస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రం "ముగ్గురు". ఈ చిత్రం ఆగస్ట్ 19 వ తేదీన విడుదల కానుంది. కోటి సంగీతం అందించిన ఈ "ముగ్గురు" చిత్రం ఆడియోకి ప్రేక్షకుల నుంచి చక్కని లభిస్తూంది.

ఈ "ముగ్గురు" చిత్రంలో బ్రహ్మానందం మాఫియా డాన్ గా నటించి నవ్వులు పండించటం విశేషం. "ముగ్గురు" చిత్రాన్ని37 రోజుల్లో బ్యాంకాక్, వైజాగ్, కారంచేడు, విశాఖపట్టణంలో చిత్రీకరించటం విశేషం. "ముగ్గురు" చిత్రాన్ని ఇంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయటానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ చిత్ర నిర్మాత, దర్శకులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చిత్రంలో నటించిన హీరోలు, హీరోయిన్లు, నటీనటులు నిర్మాత డాక్టర్ డి.రామానాయుడు గారికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.