English | Telugu

మోడీ తర్వాత ఎన్టీఆర్.. ఫ్యాన్స్ హ్యాపీ 

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ 'ఎక్స్'(X)కి ఉన్న ప్రాముఖ్యత అందరకి తెలిసిందే. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా పలు రంగాలకి చెందిన సెలబ్రటీస్, తమ అభిమానులకి ఎప్పుడు అందుబాటులో ఉంటుంటారు. అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా తమకి నచ్చిన వాళ్ళ గురించి తెలుసుకోవడానికి 'ఎక్స్' ని ఒక వేదికగా ఎంచుకుంటారు. ఇప్పుడు ఇందుకు సంబంధించి ఆగష్టు నెలలో 'ఎక్స్' వేదికగా నెటిజన్లు ఎక్కువగా మాట్లాడుకున్న మొదటి పది మంది జాబితాని రిలీజ్ చేసింది.

సదరు జాబితాలో ప్రైమ్ మినిస్టర్ 'నరేంద్ర మోదీ'(Narendra Modi)అగ్ర స్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)నిలిచాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. నేషనల్ లెవల్లో ఎన్టీఆర్ కి పెరుగుతున్న క్రేజ్ కి ఇదొక ఉదాహరణ అంటు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మూడో ప్లేస్ లో ఇళయ దళపతి విజయ్(Vijay),నాలుగో స్థానంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ప్రముఖ క్రికెటర్, శుభ్‌మ‌న్ గిల్ ఐదు, ఆరు, ఏడు,స్థానాల్లో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)8వ స్థానంలో ఉంటే, 9వ ప్లేస్ లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. ఇక పదవ స్థానంలో సూపర్ స్టార్ తలైవా 'రజనీకాంత్'(Rajinikanth)చోటు సంపాదించుకున్నాడు.

'ఎక్స్' యాజమాన్యం ఈ విధంగా ప్రతి నెల, ప్రతీ ఏడాది నెట్టింట అత్యంత ఎక్కువగా మాట్లాడుకున్న సెలబ్రటీల లిస్ట్ ప్రకటిస్తు ఉంటుంది. మరి నెక్స్ట్ మంత్ ఎవరు మొదటి పది మంది జాబితాలో ఉంటారో చూడాలి.


జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.