English | Telugu

బాహుబలి ఎపిక్, మాస్ జాతర ని దెబ్బకొట్టబోతున్న మరో మూవీ!

- మూవీ లవర్స్ లో జోష్
- థియేటర్స్ లో పండుగ వాతావరణం
- బాహుబలి ఎపిక్, మాస్ జాతర కి షాక్
- 'మొంథా' తుఫాన్ ప్రభావం ఉంటుందా!

దసరా, దీపావళి లాంటి పండగలు అయిపోయినా మూవీ లవర్స్ అందరు మరో రెండు పండుగల కోసం ఎదురుచూస్తున్నారు. ఆ రెండు పండుగల పేర్లే బాహుబలి ఎపిక్(Baahubali Epic), మాస్ జాతర(Mass Jathara). ప్రభాస్(Prabhas),రాజమౌళి(Rajamouli)ల బాహుబలి పార్ట్ 1 ,పార్ట్ 2 కలిపి మూడుగంటల నలభై నిమిషాలతో ఈ నెల 31 న రీ రిలీజ్ అవుతుండటం, రవితేజ మరోసారి తన మార్క్ అంశాలతో నవంబర్ 1 న మాస్ జాతర తో వస్తుండటంతో సినీ ప్రేమికులు ఫెస్టివల్ మూడ్ లో ఉన్నారు.

కానీ ఇప్పుడు ఈ రెండు చిత్రాలకి 'మొంథా'(Montha)తుఫాన్ అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొంథా తఫాన్ ప్రభావం వల్ల గత రెండు రోజుల నుంచే ఆంధ్రప్రదేశ్ లోని చాలా ఏరియాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. సెలవలు కూడా ప్రకటించడంతో అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరం అయితే బయటకి రావద్దని ప్రభుత్వం కూడా వెల్లడి చేసింది. పైగా ఈ రోజు అర్ధరాత్రి 'మొంథా' కాకినాడ సముద్రం వద్ద తీరం దాటనుంది. దీంతో ఇది వాయుగుండంగా మారి ఏపీలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రభుత్వాలు రెడ్ అలెర్ట్ కూడా జారీ చేసాయి. తెలంగాణలోని కూడా ఈ ప్రభావంతో చాలా ఏరియాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంటున్నారు.

Also read: ఎందుకు ఈ బెదిరింపులు! మనమంతా ఒకటేగా

ఈ రెండు చిత్రాలు అక్టోబర్ 31 , నవంబర్ 1 విడుదల అవుతున్నాయి కాబట్టి అప్పటికి వర్షం తగ్గుతుందని అనుకున్నా, దీనిపై వాతావరణ శాఖ ఖచ్చితమైన హామీని ఇవ్వడం లేదు. వాయుగుండం రోజుకి ఒక రకంగా తన గమనాన్ని మార్చుకుంటుంది. మరి రిలీజ్ కి ఇంకా ఎన్నో రోజులు లేదు. ఒక వేళ మూవీ లవర్స్ తపస్సు ఫలించి వర్షాలు తగ్గాయే అనుకుందాం. కానీ వర్షాల నుంచి అప్పుడే తేరుకున్న ప్రేక్షకులు థియేటర్స్ కి ఎంత వరకు వెళ్తారో అనే డౌట్ ని సోషల్ మీడియా వేదికగా పలువురు వ్యక్తం చేస్తున్నారు. జనరల్ గా ఒక సినిమాని మరో సినిమా దెబ్బ కొడుతుంది. ఈ లెక్కన 'మొంథా' ని కూడా ఒక సినిమాగా బావించవచ్చనే కామెంట్స్ కూడా సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి.



జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.