English | Telugu

వర్మ ది బెస్ట్ డైరెక్టర్ : మోహన్ బాబు

మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రలో నటించిన "రౌడీ" చిత్ర పాటల విడుదల కార్యక్రమం నిన్న తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ లో అత్యంత వైభవంగా జరిగింది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతాన్ని అందించారు. ఎవి. పిక్చర్స్ బ్యానర్లో విజయ్ కుమార్, గజేంద్ర నాయుడు, పార్థసారథి సంయుక్తంగా నిర్మించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు ప్రత్యేక అతిధులుగా విచ్చేసారు. పూరీ సంగీత్ ద్వారా మార్కెట్ లో లభ్యం కానున్న ఈ ఆడియోను దాసరి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ... "అప్పట్లో దాసరి గారు నన్ను కాలితో తన్ని డైలాగులు నేర్పించేవారు. అటువంటి దర్శకుల వల్లే నేడు నేను ఈ స్థాయిలో ఉన్నాను. దాసరి గారు, రాఘవేంద్రరావు గారి తర్వాత నేను చూసిన, పనిచేసిన ది బెస్ట్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. కానీ నేను వర్మ దర్శకత్వంలో చేస్తున్నాను అనగానే అందరిలో కూడా "వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారు, ఎప్పుడు విడిపోతారు?" అనే ఆతృత తప్ప... వీరిద్దరూ కలిస్తే ఓ మంచి సినిమా వస్తుందన్న మంచి ఆలోచన ఎవరిలోనూ రాలేదు. ఈ చిత్రంలో నటించాక నా వయసు ఓ పది సంవత్సరాలు పెరిగింది. వర్మ ఈ చిత్రాన్ని అధ్బుతంగా తీర్చిదిద్దాడు" అని అన్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.