English | Telugu

కొత్త రిలీజ్ డేట్ కి మిరాయ్.. రాజా సాబ్ పరిస్థితి ఏంటి..?

'హనుమాన్' తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జ.. ప్రస్తుతం 'మిరాయ్' సినిమాలో నటిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే, ఏప్రిల్ 18న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. (Mirai)

పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న 'మిరాయ్'ని ఏప్రిల్ 18న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ అప్పటికి సినిమా రెడీ అయ్యే అవకాశం లేకపోవడంతో, జూలై 4 కి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇంకా 30 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. మిగిలిన షూటింగ్ తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయడానికి టైం పడుతుందన్న కారణంతోనే జూలైకి వాయిదా వేసినట్లు వినికిడి.

అయితే 'మిరాయ్' డేట్ మారితే, 'ది రాజా సాబ్' (The Raja Saab) పరిస్థితి ఏంటనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న 'రాజా సాబ్' చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే నిర్మిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత 'మిరాయ్'ని ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తామని చెప్పడంతో.. 'రాజా సాబ్' విడుదల వాయిదా ఖాయమని భావించారంతా. కానీ ఇప్పుడు 'మిరాయ్'నే వాయిదా పడుతోంది. ఈ క్రమంలో 'రాజా సాబ్' విడుదల ఎప్పుడు ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ రెండు సినిమాల విడుదల తేదీలపై మేకర్స్ అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశముంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.