English | Telugu

యూత్ ని ఎంకరేజ్ చెయ్యాలె.. కొత్త కుర్రాళ్ళు హిట్ కొట్టారు!

కొత్త కుర్రాడు సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'మేమ్ ఫేమస్'. ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమాతో పలువురు నటీనటులతో పాటు టెక్నీషియన్స్ కూడా పరిచయమయ్యారు. ఇలా ఎందరో కొత్తవాళ్లు పనిచేసిన 'మేమ్ ఫేమస్' సినిమా మే 26న విడుదలై పరవాలేదు అనే టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా యూత్ ని బాగానే ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి, బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది.

'మేమ్ ఫేమస్' థియేట్రికల్ బిజినెస్ వేల్యూ రూ.2 కోట్లని అంచనా. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.86 లక్షల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా.. రెండో రోజు రూ.79 లక్షలు, మూడో రోజు రూ.76 లక్షల గ్రాస్ తో సత్తా చాటింది. ఆ తర్వాత కూడా రోజుకి రూ.30-40 లక్షల రేంజ్ లో గ్రాస్ రాబడుతున్న ఈ చిత్రం ఆరు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.3.50 కోట్ల గ్రాస్(1.76 కోట్ల షేర్) వసూలు చేసింది. ఇక రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలిపి రూ.1.08 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ మూవీ.. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా రూ.4.59 కోట్ల గ్రాస్(రూ.2.23 కోట్ల షేర్) సాధించింది. ఓవరాల్ గా రూ.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా, రూ.2.23 కోట్ల షేర్ తో ఆరు రోజుల్లోనే లాభాల్లోకి ఎంటరైంది. ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమాల తాకిడి లేకపోవడంతో ఫుల్ రన్ లో ఈ చిత్రం మంచి లాభాలు రాబట్టే అవకాశముంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.