English | Telugu

Chiranjeevi: మెగాస్టార్ ట్రిపుల్ ట్రీట్.. ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది!

2023 సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. అదే ఏడాది ఆగస్టులో వచ్చిన 'భోళా శంకర్'తో పరాజయాన్ని చూశారు. చిరంజీవి నుంచి కొత్త సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయింది. దీంతో అభిమానులు మెగాస్టార్ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ గ్యాప్ ని భర్తీ చేసేలా ఇప్పుడు ఒకే ఏడాది మూడు సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు చిరు.

ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా చేస్తున్నారు చిరంజీవి. 2026 సంక్రాంతికి ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈ ఏడాది విడుదల కావాల్సిన 'విశ్వంభర' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ మూవీ కూడా 2026 వేసవిలో థియేటర్లలో అడుగుపెట్టనుంది. వీటితో పాటు మరో సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల కానుందని తెలుస్తోంది.

'వాల్తేరు వీరయ్య' తర్వాత చిరంజీవి, దర్శకుడు బాబీ మరోసారి చేతులు కలిపారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ని చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టులో అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ లో షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రాన్ని 2026 చివరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అంటే ఒకే ఏడాది మూడు సినిమాలతో సందడి చేయబోతున్నారు చిరంజీవి. మరి ఈ సినిమాలతో ఆయన బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.