English | Telugu

ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది.. ఎక్స్ వేదికగా స్పందించిన రష్మిక 

శుక్రవారం తెల్లవారుజామున ప్రతి ఒక్కరి హృదయం తల్లడిల్లిపోయేలా హైదరాబాద్(Hyderabad)నుంచి బెంగుళూరు(Bengaluru)వెళ్తున్న ప్రవైట్ బస్ కర్నూలు(Kurnool) సమీపంలోని చిన్నటేకూరు(Chinna tekur)జాతీయ రహదారి వద్ద అగ్నికి ఆహుతయ్యింది. ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. అందరి శరీరాలు మాంసం ముద్దలుగా మిగిలాయి.వాళ్ళల్లో చిన్న పిల్లలు కూడా ఉండటం అత్యంత బాధాకరం.

ఈ విషయంపై రష్మిక స్పందిస్తు కర్నూల్ బస్ ప్రమాద సంఘటన అత్యంత విషాదకరం. ఆ వార్త వినగానే నా హృదయం ముక్కలయ్యింది.ఎంతగానో బాధపడుతున్నాను. మండుతున్న బస్ లోపల చనిపోయిన ప్రయాణికులు అనుభవించిన బాధ వర్ణనాతీతం.కాలిపోయే ముందు వాళ్ళ ఎంత బాధ పడ్డారో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది.ఇందులో ఇద్దరు చిన్న పిల్లలతో సహా ఒక కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన వారికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్దిస్తున్నాని ఎక్స్ వేదికగా తెలిపింది.

సోనుసూద్(Sonu Sood),కిరణ్ అబ్బరం(Kiran Abbavaram)తో పాటు చాలా మంది నటులు,నటీమణులు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకి తమ సానుభూతిని తెలియచేస్తున్నారు. ఇక బైక్ ని ఢీ కొట్టిన తర్వాత డ్రైవర్ బస్ ని వెంటనే ఆపి ఉంటే అందరి ప్రాణాలు మిగిలేవి. అలా చేయకుండా బైక్ ని సుమారు 200 మీటర్లు ఈడ్చుకెళ్లాడు.దీంతో బైక్ కి చెందిన పెట్రోల్ పంప్ మూత ఊడిపోవడంతో అగ్గి రవ్వలు చెలరేగి బస్ మొత్తం వ్యాపించడంతో బస్ అగ్నికి ఆహుతయినట్టుగా తెలుస్తుంది. బస్ కి చెందిన సెన్సర్లు పనిచేయక పోవడంతో ఆటోమేటిక్ డోర్స్ లాక్ అవ్వడం కూడా ప్రమాద తీవ్రతకి కారణమని తెలుస్తుంది. దీంతో రవాణాశాఖ అధికారులు ఇప్పటికైనా కఠినమైన నిబంధనలు అమలు చెయ్యాలని సోషల్ మీడియా వేదికగా పలువురు కోరుతున్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.