English | Telugu

శివ మూవీపై అల్లు అర్జున్ వీడియో.. రెండు లారీలతో థాంక్స్ చెప్పిన నాగార్జున  

తెలుగు సినిమా స్థితిని, గతిని మార్చేసిన చిత్రాల్లో కింగ్ నాగార్జున 'శివ'(Shiva)కూడా ఒకటి. 1989 అక్టోబర్ 5 న రిలీజైన శివ నాగార్జున(Nagarjuna)కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా టెక్నీకల్ గాను నూతన ఒరవడిని సృష్టించింది. భారతీయ సినీ పరిశ్రమ మొత్తాన్ని కూడా తెలుగు సినిమా వైపు చూసేలా చేసింది. ఇప్పుడు ఈ మూవీ నవంబర్ 14 న రీ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ 'అల్లుఅర్జున్'(Allu Arjun)శివ గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అల్లు అర్జున్ మాట్లాడుతు శివ రిలీజ్ అయ్యి దాదాపుగా 36 ఏళ్ళవుతుంది. ఎప్పటికి తెలుగు సినిమాకే కాదు ఇండియన్ సినిమాకి శివ ఒక ఐకాన్ మూవీ. శివ తర్వాతే తెలుగు సినిమాతో పాటు ఇండియన్ సినిమాల్ని తెరకెక్కించే విధానంలో మార్పులు వచ్చాయి. అలాంటి శివ మళ్ళీ హయ్యస్ట్ క్వాలిటీతో, టెక్నాలజీ తో రీ రిలీజ్ కాబోతుంది. దీంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో పండుగ వాతావరణం రానుంది. నాగార్జున గారి ఫ్యాన్స్ ఈ సారి థియేటర్స్ కి రెండు లారీల పేపర్స్ తీసుకెళ్లండని సదరు వీడియోలో చెప్పాడు.

సదరు వీడియోని నాగార్జున తన 'ఎక్స్'(X)అకౌంట్ వేదికగా షేర్ చెయ్యడంతో పాటుగా డియర్ అల్లు అర్జున్, రెండు లారీల థాంక్స్ అనే క్యాప్షన్ ఉంచాడు. అన్నపూర్ణ సంస్థ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శివ ని రీ రిలీజ్ చేస్తున్నారు. రామ్ గోపాల్(Ram Gopal Varma)దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించగా నాగార్జునతో అమల(Amala)జత కట్టింది. భవాని క్యారక్టర్ లో రఘువరన్(Raghuvaran)ఒక కొత్త రకం విలనిజాన్ని భారతీయ చిత్ర పరిశ్రమకి పరిచయం చేసాడు. సాయిచంద్, శుభలేఖ సుధాకర్, చిన్నా, రామ్ జగన్ తదితరులు కీలక పాత్రలు పోషించగా ఇళయరాజా(Ilaiyaraaja)అందించిన సాంగ్స్ కూడా ట్రెండ్ సెట్ గా నిలిచాయి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.